మైనింగ్ మాఫియా ఆగడం: జర్నలిస్ట్ సజీవదహనం
షాజహాన్ పూర్: మాఫియా ఆగడాలపై వార్తలు వ్రాసినందుకు ఒక జర్నలిస్ట్ ను సజీవదహనం చేసిన దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో జరిగింది. షాజహాన్ పూర్ లో నివాసం ఉంటున్న జితేంద్ర సింగ్ అనే జర్నలిస్ట్ హత్యకు గురైనాడు.
జితేంద్ర సింగ్ స్థానిక పత్రికలో జర్నలిస్ట్ గా పని చేస్తున్నాడు. ఇతను మైనింగ్ మాఫియా మీద వార్త కథనాలు వ్రాశాడు. తరువాత ఆ వార్తల క్లిప్పింగ్ లను ఫేస్ బుక్ లో ఫోస్ట్ చేశాడు. ఈ విషయం జీర్ణించుకొలేని మైనింగ్ మాఫియా జితేంద్ర సింగ్ ను అంతం చెయ్యాలని ప్లాన్ వేశారు.

చివరికి సోమవారం సాయంత్రం జితేంద్ర సింగ్ ను పట్టుకుని పెట్రోల్ పోసి నిప్పంటించారు. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు నిర్దారించారు. తన భర్త మీద ఒక పోలీసు అధికారి పెట్రోల్ పోసి నిప్పంటించారని జితేంద్ర భార్య ఆరోపిస్తున్నారు.
సమాజ్ వాదీ పార్టీ శాసన సభ్యుడు రాంమూర్తి అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు సహకరిస్తున్నాడని, అతనే జితేంద్ర సింగ్ ను హత్య చేయించాడని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద జితేంద్ర సింగ్ హత్య సంచలనం కలిగించింది.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు!












Click it and Unblock the Notifications