బార్లో కవరేజ్ కోసం వెళ్లిన జర్నలిస్ట్ హత్య
ముంబై/న్యూఢిల్లీ: ముంబైకి చెందిన జర్నలిస్ట్ ఒకరు హత్యకు గురయ్యారు. సదరు జర్నలిస్ట్, ఇతర సిబ్బంది థానేలోని ఓ బార్లో కవర్ చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో బార్ స్టాఫ్ దాడిలో అతను మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు.
సదరు జర్నలిస్ట్ పేరు రాఘవేంద్ర దుబే. దాడి అనంతరం జర్నలిస్ట్ బాడీ ఘటన జరిగిన కొద్ది దూరంలో కనిపించింది. లోకల్ మేగజైన్లో పని చేస్తున్న సంతోష్ మిశ్రా, శశి శర్మ అనే ఇద్దరు సదరు బార్ వద్దకు గురువారం వెళ్లారు.

వారి పైన బార్ సిబ్బంది దాడికి పాల్పడింది. వీరిపై దాడి అనంతరం రాఘవేంద్ర దుబే కవరేజ్ చేసేందుకు వెళ్లాడు. శుక్రవారం ఉదయం సమీపంలో ఓ శవం కనబడినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ శవం రాఘవేంద్ర దుబేదిగా గుర్తించారు. నిందితుల పైన చర్య తీసుకోవాలని ముంబైలో జర్నలిస్టులు ఆందోళనకు దిగారు.












Click it and Unblock the Notifications