వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కదిలే రైలు నుంచి ఇద్దరు మహిళల తోసివేత, మృతి

|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్‌ రాష్ట్రంలోని పశ్చిమచంపారన్‌ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కదిలే రైలు నుంచి గుర్తుతెలియని వ్యక్తులు తోసివేయడంతో ఓ మహిళ మృతిచెందగా.. మరో మహిళ తీవ్రంగా గాయపడింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మమతా మిశ్రా, శ్వేత వర్మ అనే ఇద్దరు మహిళలు నర్కతియాగంజ్‌-హాజిపూర్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నారు. కాగా, బేతియా రైల్వే స్టేషన్‌ సమీపంలో ఆ మహిళలను గుర్తుతెలియని వ్యక్తులు కదిలే రైలు నుంచి తోసివేశారు.

Jungle raj returns in Bihar: Two women thrown off running train, one dead

తీవ్ర గాయాలపాలైన శ్వేతవర్మ అక్కడికక్కడే మృతిచెందింది. మరో మహిళ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. మహిళలను ఎందుకు తోసివేశారన్న దానిపై స్పష్టమైన సమాచారం లేదు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఇద్దరు బాధిత మహిళలకు చెందిన రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారు చివరిగా ఫోన్ చేసిన ఇద్దరు పురుషుల వివరాలను తెలుసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. బాధిత మహిళలు కబీర్‌నగర్ జిల్లాలోని ఖలిలాబాద్ పట్టణానికి చెందిన వారని పోలీసులు చెప్పారు.

English summary
A young woman was killed and another seriously injured today after unidentified persons pushed them from a running train near Bettiah railway station in West Champaran district, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X