దీదీ వర్సెస్ మోదీ : మమతకు పెరుగుతున్న మద్దతు, అండగా ఉంటామన్న కేజ్రీవాల్

మోగ : బెంగాల్ ఘటన తర్వాత దీదీకి మద్దతు పెరుగుతుంది. బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ మమతకు అండగా నిలుస్తున్నారు. తాజాగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మేమున్నామంటు భరోసానిచ్చారు. గురువారం పంజాబ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

 kajriwal support to mamatha

అమిత్ కారణం
బెంగాల్‌లో చెలరేగిన ఘర్షణలకు బీజేపీ చీఫ్ అమిత్ షా కారణమని ఆరోపించారు. ఎన్నికల సంఘం కూడా పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రధాని మోదీ ర్యాలీ కోసం మిగిలిన వారి ప్రచారాలను ఆపేశారని, ఆ ర్యాలీ అనంతరం ఏకంగా ప్రచారమే చేయకుండా ఈసీ నిషేధం విధించడం దారుణమన్నారు. ఈసీ బహిరంగంగానే బీజేపీకి మద్దతునిస్తున్నట్లుగా కనిపిస్తోందని ఆరోపించారు. మోదీకి, అమిత్‌ షాకి ప్రజలు ఓటుతోనే బుద్ధి చెబుతారని అన్నారు.

నిలిచిన ప్రచారం
కోల్ కతాలో అమిత్ షా ర్యాలీలో చెలరేగిన హింసతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఎన్నికల సంఘం ప్రచారాన్ని గురువారం ఉదయం 10 గంటల వరకు నిలిపివేసింది. శుక్రవారం సాయంత్రం వరకు చేయాల్సిన ప్రచారం ఒకరోజు ముందుగానే ఆపివేశారు. దీనిని మమతా తీవ్రంగా ఖండించారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, డీఎంకే చీఫ్ స్టాలిన్ మమతకు అండగా నిలిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+