కలాం మృతి: సండే సెలవు, కాదు.. కేరళ కన్ఫ్యూజన్
తిరువనంతపురం: 'నేను మరణిస్తే సెలవు ప్రకటించవద్దు. అదనంగా మరో రోజు పని చేయాలి. అలా చేస్తే నాకు అనందం' అని చెప్పిన మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాం చెప్పారు. దీనిని ఆదర్శంగా తీసుకొని కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓ ట్వీట్ చేశారు. ఇది గందరగోళానికి దారి తీసింది.
అబ్దుల్ కలాంకు నివాళిగా ఆదివారం నాడు కేరళ ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు పని చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి థామ్సన్ సామాజిక అనుసంధాన వేదిక ద్వారా వెల్లడించారు.

దీనితో ప్రభుత్వం విభేదించింది. వెంటనే దానిని తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. కలాం మృతి నేపథ్యంలో కేంద్రం ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. ఆయన మరణం నేపథ్యంలో సెలవు మాత్రం ప్రకటించలేదు.
అబ్దుల్ కలాంకు నివాళిగా ప్రభుత్వ సీఎస్ కూడా ఆదివారం ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తాయని చెప్పినప్పటికీ, కేరళ ప్రభుత్వం దానిని తొలగించాలని సూచించింది. అయితే, ఆ పోస్టును అతను తొలగించే బదులు, తుది నిర్ణయం కోసం కాసేపు నిరీక్షించాలని ట్వీట్ చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications