రాహుల్ గాంధీపై సంచలన ఆరోపణలు చేసిన స్టార్ హీరోయిన్
కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ బీజేపీ ఎంపీ, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సంచలన కామెంట్స్ చేశారు. దేశంలోనే రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకరమైన, విషపూరిత, విధ్వంసకర వ్యక్తి అని ఆరోపించారు. ఆయన ప్రధాన మంత్రి కాకపోవడం వల్లే దేశం ఇలా కలిసి ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఆయన ప్రధాన మంత్రి కాకపోవడం వల్ల దేశాన్ని విఛ్ఛిన్నం చేయడానికి కూడా రెడీ అవతారని కంగనా చెప్పుకొచ్చారు.
ఎక్స్ ట్విట్టర్లో సోమవారం పోస్ట్ చేసిన కంగనా హిండెన్ బర్గ్ రిపోర్ట్ ఆధారంగా స్టార్ మార్కెట్ గురించి రాహుల్ గాంధీ అసంతృప్తి కర వ్యాఖ్యలు చేస్తున్నారు. మన యొక్క భద్రత, ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గాంధీ.. మీరు జీవితాంతం ప్రతిపక్షంలోనే కూర్చొడానికి సిద్ధంగా ఉండండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మిమ్మల్ని ఎన్నటికీ తమ నాయకుడిగా ఎంచుకోరు అని విమర్శించారు. మరోవైపు సెబీ చైర్ పర్సన్ మాధవి పురి బచ్ పై హిండెన్ బర్గ్ వెల్లడించిన నివేదిక దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. దీనిపై రాజకీయ దుమారం చేలరేగింది.

సెబీ ఛైర్పర్సన్ మధాబి పూరీ బుచ్కి సంబంధించిన సంభావ్య వైరుధ్యాల గురించి ఆందోళనలు రేకెత్తిస్తూ, భారతదేశ స్టాక్ మార్కెట్ సమగ్రత గురించి రాహుల్ గాంధీ గతంలో హెచ్చరిక జారీ చేశారు. అక్రమ వాటా మరియు ధరల తారుమారుకి సంబంధించి అదానీ గ్రూప్పై వచ్చిన ఆరోపణల తీవ్రతను నొక్కి చెబుతూ, బుచ్ ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదని గాంధీ ప్రశ్నించారు."స్టాక్ మార్కెట్ను నియంత్రించే సంస్థలు రాజీ పడినందున భారతీయ స్టాక్ మార్కెట్లో గణనీయమైన ప్రమాదం ఉందని మీ దృష్టికి తీసుకురావడం ప్రతిపక్ష నాయకుడిగా నా కర్తవ్యం. ఇది పేలుడు ఆరోపణ. అంపైర్ స్వయంగా రాజీ పడ్డారని ఆరోపిస్తున్నందున... సెబీ ఛైర్పర్సన్ మధాబి పూరీ బుచ్ ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి కంగనా రనౌత్ కౌంటరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications