మాజీ కార్పొరేటర్ కొడుకుతో.. నటి నిశ్చితార్థం!
కన్నడ గోల్డెన్ క్వీన్ గా పేరు పొందిన ప్రముఖ నటి, ‘చెలువిన చిత్తార’ సినిమా హీరోయిన్ అమూల్య త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతోంది.
బెంగళూరు: కన్నడ గోల్డెన్ క్వీన్ గా పేరు పొందిన ప్రముఖ నటి, 'చెలువిన చిత్తార' సినిమా హీరోయిన్ అమూల్య త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతోంది. రాజకీయ నాయకుడు, మాజీ కార్పొరేటర్ జీహెచ్ రామచంద్రన్ కొడుకు జగదీష్ ఆర్ చంద్రతో ఆమె నిశ్చితార్థం ఇటీవల ఘనంగా జరిగింది.
వచ్చే మే నెలలో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. 23 ఏళ్ల అమూల్య ఇప్పటి వరకు 20కి పైగా కన్నడ చిత్రాల్లో నటించి ప్రముఖ కథానాయుకగా పేరు సంపాదించుకుంది. తన సహ నటుడు గణేష్ భార్య ద్వారా జగదీష్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది.
Engagement of #amulya and Jagdesh 💍 pic.twitter.com/aMYnWHi65A
— Ganesh (@Official_Ganesh) March 6, 2017
ఈ పరిచయం వారి పరిణయానికి దారితీసింది. 2001లో బాల నటిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన అమూల్య అనతి కాలంలోనే నటిగానూ తనను తాను నిరూపించుకున్నది.
Sooo much love to @Amulya_moulya on her Engagement😘😘😘
— Harshika Poonacha (@actressharshika) March 6, 2017
She makes such a beautiful bride.
Wishing you all Happiness darling.God bless you 💕💕💕💕 pic.twitter.com/IkFBePvYxD
కన్నడ హీరో గణేష్ సరసన చెలువిన చిత్తార సినిమాలో నటించిన ఆమె.. చైత్రదా చంద్రమా, నాను నన్న కనసు, శ్రావణి సుబ్రహ్మణ్య, గజకేసరి వంటి చిత్రాలతో విజయాలు అందుకుంది. శ్రావణి సుబ్రహ్మణ్య సినిమాకు అమూల్య ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు కూడా పొందింది.