షాకింగ్: కార్గిల్ యుద్ధంలో చావు తప్పించుకున్న షరీఫ్, ముషారఫ్!
కార్గిల్ యుద్ధానికి సంబంధించి ఓ ఆశ్చర్యకరమైన వార్త వెలుగుచూసింది. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ కార్గిల్ యుద్ధంలో త్రుటిలో చావు తప్పించుకొన్నారట.
న్యూఢిల్లీ: కార్గిల్ యుద్ధానికి సంబంధించి ఓ ఆశ్చర్యకరమైన వార్త వెలుగుచూసింది.
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ కార్గిల్ యుద్ధంలో త్రుటిలో చావు తప్పించుకొన్నారట. భారత వాయుసేన విమానం 'జాగ్వార్' 1999 జూన్ 24న పాక్ సైనిక స్థావరమైన గుల్తెరిపై ఉదయం 8.45 గంటలకు గురి పెట్టింది.
అయితే ఆ దాడిలో షరీఫ్, ముషారఫ్లు తప్పించుకున్నట్టు సమాచారం. గుల్తెరి సైనిక స్థావరంపై భారత విమానం బాంబు జారవిడవాల్సి ఉంది. అయితే, అక్కడ షరీఫ్, ముషారఫ్ ఉండటంతో బాంబు వేయొద్దని ఎయిర్ కమాండెంట్.. విమానంలోని పైలట్కు సూచించారట.

ఆ తర్వాత దాన్ని భారత నియంత్రణ రేఖకు సమీపంలో జారవిడిచారు. దీంతో షరీఫ్, ముషారఫ్ చావు తప్పించుకొన్నారు. గుల్తెరి పాక్ సైన్యం ప్రధాన స్థావరాల్లో ఒకటి. కార్గిల్ యుద్ధ సమయంలో సైనికులకు ఆహార, మందుగుండు, ఇతర సామగ్రిని ఇక్కడి
నుంచే సరఫరా చేసేవారు.
కాగా షరీఫ్, ముషారఫ్ ఇద్దరూ ఆ రోజే తొలిసారి షక్మా సెక్టార్లోని నియంత్రణ రేఖ పొడవునా పర్యటించారు. ఒక వేళ ఎయిర్ కమాండెంట్ ఆపకపోతే.. భారత సైన్యం బాంబు దాడిలో షరీఫ్, ముషారఫ్ ప్రాణాలు వదిలేవారు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications