వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెల్జియంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కుమారుడు కన్నుమూత

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పుత్ర వియోగం కలిగింది. బెల్జియంలో చిక్సిత పొందుతున్న సిద్ధరామయ్య పెద్ద కుమారుడు రాకేష్ భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో కన్నుమూశారు. రాకేశ్ శరీరంలో బహుళ అవయవాలు వైఫల్యం అయినట్టు వైద్యలు వెల్లడించారు.

వివరాల్లోకి వెళితే స్నేహితులతో కలిసి యూరప్ టూర్‌కు వెళ్లిన రాకేశ్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. రాకేశ్ ప్యాంక్రియాసిస్‌కు సంబంధించిన వ్యాధితో బాధపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం సిద్ధరామయ్య మంత్రి సుష్మాస్వరాజ్‌తో మాట్లాడి బెల్జియంలో ఉన్న తన కుమారుడికి ఉత్తమ వైద్య సేవలు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.

Karnataka Chief Minister Siddaramaiah's son Rakesh dies in Belgium

దీనిపై సుష్మా స్పందించి రాకేష్ కు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని బ్రసెల్స్‌లోని ఇండియన్ ఎంబసీ ఉద్యోగులను ఆదేశించారు. తీవ్ర కడుపునొప్పి రావడంతో అతడిని బ్రస్సెల్స్‌ యూనివర్సిటీ ఆసుపత్రిలోని ఐసీయూలో చేర్చి చికిత్సను అందిస్తున్నారు.

ఈ వార్త తెలియగానే సిద్ధరామయ్య భార్య, చిన్న కుమారుడు యతీంద్ర, ఫ్యామిలీ డాక్టర్స్‌ ఇద్దరితో బ్రస్సెల్స్ చేరుకున్నారు. అనంతరం గురువారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెల్జియం బయల్దేరి వెళ్లారు. సీఎం సిద్ధరామయ్య కూడా ప్రస్తుతం బెల్జియంలో ఉన్నారు. రాకేష్‌ను కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

English summary
Karnataka Chief Minister Siddaramaiah's son Rakesh dies in Belgium due to multiple organ failure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X