Cauvery: స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తమిళనాడు నాయకులు ఇలాగే బతికేస్తున్నారు, సీఎం ఫైర్ !
బెంగళూరు: కావేరీ నీటి పంపిణి విషయంలో మరోసారి కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాలు మరోసారి మీడియా ముందుకు వచ్చాయి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి తమిళనాడు రాజకీయ నాయకులు కావేరీ నీటి విషయం తప్పా ఆ రాష్ట్ర ప్రజల సమస్యల గురించి పట్టదని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మయ్ మండిపడ్డారు. ఎప్పుడు చూసినా పదేపదే కావేరీ నీటి విషయం ముందు పెట్టుకుని తమిళనాడు రాజకీయ నాయకులు కాలం గడిపేస్తున్నారని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మయ్ విమర్శించారు. కావేరీ నీటి సమస్య పరిష్కారం అయినా కావాలనే పదేపదే సుప్రీం కోర్టులో తమిళనాడు రాజకీయ నాయకులు పిటిషన్లు వేసుకుని కాలం గడిపేస్తున్నారని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మయ్ విరుచుకుపడ్డారు.
కావేరి నీటి విషయంలో కర్ణాటకకు న్యాయం జరిగే వరకు ఎంతవరకు అయినా పోరాటం చేస్తామని, తాగునీటి విషయంలో మేము రాజీపడే అవకాశం ఏమాత్రం లేదని, కావేరి నది పుట్టింది కర్ణాటకలో అనే విషయం తమిళనాడు రాజకీయ నాయకులు గుర్తు పెట్టుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ అన్నారు. కావాలనే తమిళనాడు రాజకీయ నాయకులు మేకదాటు ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని బసవరాజ్ బొమ్మయ్ ఆరోపించారు. అవసరం అయితే కర్ణాటకలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు కావేరి నీటి కోసం పోరాటం చెయ్యడానికి సిద్దం అవుతారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ అన్నారు.
Illegal affair: భర్త బయట ఉంటే అందంగా రెఢీ అవుతున్న భార్య, చంపేసి బావిలో శవం వేసి, మ్యాటర్ !
స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇలాగే బతికేస్తున్నారు
కావేరీ నీటి పంపిణి విషయంలో మరోసారి కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాలు మరోసారి మీడియా ముందుకు వచ్చాయి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి తమిళనాడు రాజకీయ నాయకులు కావేరీ నీటి ముందు పెట్టుకుని కాలం గడిపేస్తున్నారని, అక్కడి నాయకులకు కావేరి విషయం తప్పా ఆ రాష్ట్ర ప్రజల సమస్యల గురించి పట్టదని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మయ్ మండిపడ్డారు
మంగళవారం బెంగళూరులో కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మయ్ మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు రాజకీయ నాయకుల మీద విరుచుకుపడ్డారు.
కావేరీ నీటి వాటా ఎక్కువ కావాలంటే ఎలా ?
ఇప్పటికే కావేరి నీరు పంపిణి చెయ్యడానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు అయ్యింది. ప్రత్యేక బోర్డు నీటి పంపిణి విషయంలో తీర్పుకూడా ఇచ్చిందని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మయ్ గుర్తు చేశారు. మా రాష్ట్రంలో పుట్టిన కావేరీ నీటిలో ఎక్కువ వాటా అడుగుతున్న తమిళనాడు రాజకీయ నాయకులు మా రాష్ట్రంలోని ప్రజల గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మయ్ విమర్శించారు. కావాలనే తమిళనాడు రాజకీయ నాయకులు మేకదాటు ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని బసవరాజ్ బొమ్మయ్ ఆరోపించారు.
కావేరి విషయం పరిష్కారం అయినా ?
ఎప్పుడు చూసినా పదేపదే కావేరీ నీటి విషయం ముందు పెట్టుకుని తమిళనాడు రాజకీయ నాయకులు కాలం గడిపేస్తున్నారని కర్ణాటక సీఎం విమర్శించారు. కావేరీ నీటి సమస్య పరిష్కారం అయినా కావాలనే పదేపదే సుప్రీం కోర్టులో తమిళనాడు రాజకీయ నాయకులు పిటిషన్లు వేసుకుని కాలం గడిపేస్తున్నారని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మయ్ విరుచుకుపడ్డారు.
ఎంత వరకు అయినా పోతాం, బొమ్మయ్
కావేరి నీటి విషయంలో కర్ణాటకకు న్యాయం జరిగే వరకు ఎంతవరకు అయినా పోరాటం చేస్తామని, తాగునీటి విషయంలో మేము రాజీపడే అవకాశం ఏమాత్రం లేదని, కావేరి నది పుట్టింది కర్ణాటకలో అనే విషయం తమిళనాడు రాజకీయ నాయకులు గుర్తు పెట్టుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ అన్నారు. అవసరం అయితే కర్ణాటకలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు కావేరి నీటి కోసం పోరాటం చెయ్యడానికి సిద్దం అవుతారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ అన్నారు.