ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన హీరో సుదీప్, దుమ్ము దులిపేసిన సీఎం ర్యాలీ, జేపీ నడ్డా !
బెంగళూరు/శివమొగ్గ: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అట్టహాసంగా నామినేషన్ వేశారు. కర్ణాటకలోని శిగ్లావి నియోజక వర్గం నుంచి మరోసారి బసవరాజ్ బోమ్మయ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ, నడ్డా, స్టార్ హీరో కిచ్చా సుదీప్ తో పాటు స్థానిక బీజేపీ నాయకుల సమక్షంలో సీఎం బసవరాజ్ బోమ్మయ్ అట్టహాసంగా నామినేషన్ వేశారు.
నామినేషన్ వేసే ముందు సీఎం బసవరాజ్ బోమ్మయ్ శిగ్లావి పట్టణంలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఇదే రోడ్ షోలో కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ తో పాటు కన్నడ స్టార్ హీరో సుదీప్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా పాల్గొన్నారు. బసవరాజ్ బోమ్మయ్ ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో వేలాది మంది బీజేపీ కార్యకర్తలు వెంట ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం బసవరాజ్ బోమ్మయ్ కి తాను మద్దతు ప్రకటిస్తానని ఇప్పటికే కన్నడ స్టార్ హీరో సుదీప్ ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారం సీఎం బసవరాజ్ బోమ్మయ్ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన కన్నడ హీరో కిచ్చా సుదీప్ సీఎం బసవరాజ్ బోమ్మయ్ తరుపున ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టారు.
సీఎం బసవరాజ్ బోమ్మయ్ పేదల కోసం చాలా మంచి పనులు చేశారని, ఇక్కడి ప్రజలు ఆయన్న ఆధరించి ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని స్థానిక ఓటర్లకు హీరో కిచ్చా సుదీప్ మనవి చేశారు. బుధవారం సాయంత్రం వరకు వివిద ప్రాంతాల్లో హీరో సుదీప్ సీఎం బసవరాజ్ బోమ్మయ్ కి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు.

తన కోరిక ప్రకారం తన నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన హీరో సుదీప్ కు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్రత్యేక విమానంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ, నడ్డా, హీరో సుదీప్ కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ నామినేషన్ కార్యక్రమానికి శిగ్లావికి హాజరైనారు. హీరో సుదీప్ ను చూడటానికి శిగ్లావిలోని వేలాది మంది ఆయన అభిమానులు పోటీపడ్డారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications