ప్రజల్లో నన్ను విలన్ ను చేశారు, ప్రధాని మోడీని మాత్రం, కర్ణాటక సీఎం కుమారస్వామి ఫైర్ !
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి మీడియా మీద విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీని ఒక రకంగా, తనను ఒక రకంగా చూస్తున్నారని, కర్ణాటక ప్రజల్లో తనను విలన్ చేస్తున్నారని, ఇదేనా మీ తీరు అంటూ ముఖ్యమంత్రి హెచ్. డి. కుమారస్వామి మండిపడ్డారు.
శనివారం బెంగళూరులో సీఎం హెచ్.డి. కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా మీడియా తనను ప్రజల్లో విలన్ గా నిలబెడుతోందని సీఎం. హెచ్.డి. కుమారస్వామి ఆరోపించారు. కర్ణాటకలో ఉన్న జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని సీఎం కుమారస్వామి చెప్పారు.

కర్ణాటకలో పెట్రోల్, డీజల్ మీద అధిక పన్ను ఎందుకు వేశారు అని మీడియా ప్రశ్నించిన సమయంలో సీఎం హెచ్.డి. కుమారస్వామి అసహనం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ పెట్రోల్ మీద రూ. 20 పెంచిన సమయంలో మీడియా మౌనంగా ఉందని సీఎం కుమారస్వామి ఆరోపించారు.
దేశ వ్యాప్తంగా గ్యాస్ సిలిండ్ మీద ఇప్పటి వరకూ రూ. 300 పెంచితే అప్పుడు మీడియా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదని, రెండు నెలలు కూడా పూర్తి కాని కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని మాత్రం ప్రశ్నిస్తోందని సీఎం హెచ్.డి. కుమారస్వామి అసహనం వ్యక్తం చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications