Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎంకు రూ 10 వేలు ఫైన్ వేసిన కోర్టు, సీఎంతో సహా నాయకులకు సమన్లు, విచారణకు రండి !

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఊహించని ఎదురుదెబ్బ పడింది. 2022 ఏప్రిల్ నెలలో సివిల్ కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య కేసుకు సంబంధించి అప్పటి రాష్ట్ర మంత్రి కేఎస్ ఈశ్వరప్పను (బీజేపీ)ని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపిన ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులపై కర్ణాటక హైకోర్టు మంగళవారం తీవ్రంగా మండిపడింది.

సీఎం సిద్ధరామయ్య, ఆయన కేబినెట్‌ సహచరులైన భారీ, మధ్యతరహా పరిశ్రమల శాఖా మంత్రి ఎంబీ పాటిల్‌, రవాణా శాఖా మంత్రి రామలింగా రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా వంటి వారిపై మండిపడిన న్యాయస్థానం రూ 10,000 రూపాయల జరిమానా విధించింది. మార్చి 6వ తేదీన సీఎం సిద్ధరామయ్య విచారణకు హాజరు కావాలని, మార్చి 7వ తేదీన కర్ణాటక రవాణా శాఖా మంత్రి రామలింగా రెడ్డి, మార్చి 11వ తేదీన కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటక ఇంచార్జి రణదీప్ సింగ్ సూర్జేవాలా, మార్చి 15వ తేదీన కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్‌ కోర్టులో విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసిన కోర్టు వారికి సమన్లు ​​జారీ చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

Karnataka CM Siddaramaiah fined Rs 10,000 by Karnataka court

కర్ణాటకకు చెందిన కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ మృతిలో మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ఈశ్వరప్పను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బెంగళూరులోని విధానసౌదలో అప్పటి ప్రతిపక్ష నేతలు నిరసనకు దిగారు. అంతే కాకుండా అప్పటి సీఎం బసవరాజ్ బోమ్మయ్ తన పదవికి రాజీనామా చేయాలని అప్పట్లో డిమాండ్ చేస్తూ ఆయన అధికారిక నివాసానికి నియమాలు ఉల్లంఘించి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేశారనే ఆరోపణలున్నాయి. ఆ సందర్బంలో వీరి మీద కేసులు నమోదు అయ్యాయి.

Karnataka CM Siddaramaiah fined Rs 10,000 by Karnataka court

ఈ నేపథ్యంలో తమపై నమోదైన క్రిమినల్ కేసును రద్దు చేయాలని కోరుతూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఇతర కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ దీక్షిత్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ కొట్టివేసింది. అంతేకాకుండా విచారణకు హాజరుకావాలని సీఎం సిద్దరామయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సమన్లు ​​జారీ చేశారు. 2022 ఏప్రిల్ 2022లో సివిల్ కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఉడిపిలోని ఓ లాడ్జిలో శవమై కనిపించాడు.

ప్రతి కాంట్రాక్ట్‌ నుంచి 40 శాతం కమీషన్‌ అడుగుతున్నారని, అప్పటి మంత్రి కేఎస్ ఈశ్వరప్ప అవినీతికి పాల్పడ్డారని సిద్దరామయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ సమయంలో అప్పటి గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖా మంత్రి పదవికి కేఎస్ ఈశ్వరప్ప రాజీనామా చేశారు. సివిల్ కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు రావడంతో కేఎస్ ఈశ్వరప్ప అప్పట్లో ఆయన మంత్రి పదవికి రాజీనామా చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చెయ్యడనికి కేఎస్ ఈశ్వరప్పకు బీజేపీ హైకమాండ్ అవకాశం ఇవ్వలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+