ఆ పని జరగకపోతే సీఎం పదవికి రాజీనామా చెయ్యాల్సిందే, బాంబు పేల్చిన సొంత పార్టీ ఎమ్మెల్యే!
కర్ణాటక రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలవకుంటే నైతిక బాధ్యత వహిస్తూ సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయాల్సి ఉంటుందని తుమకూరు జిల్లాలోని గుబ్బి నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎస్.ఆర్. శ్రీనివాస్ బాంబు పేల్చారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ సీనియర్ నాయకులు హడలిపోయారు. సొంతపార్టీ ఎమ్మెల్యే శ్రీనివాస్ స్టేట్ మెంట్ తో సీఎం సిద్దరామయ్య షాక్ అయ్యారని తెలిసింది.
లోక్సభ ఎన్నికల పోరు చాలా జోరుగా సాగుతోంది. వరుసగా మూడోసారి కేంద్రంలో అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ వ్యూహం రచించించింది. అయితే కాంగ్రెస్ కూడా ఇండియా కూటమితో కలిసి అధికారం చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎక్కువ ఎంపీ సీట్లు కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. కర్ణాటక రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలకు పార్టీ ముఖ్యులకే లోక్ సభ ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించారు.

అందుకు తగ్గట్టుగానే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులంతా రంగంలోకి దిగారు. గుబ్బి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎస్. ఆర్. శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలవకుంటే నైతిక బాధ్యత వహిస్తూ సిద్ధరామయ్య ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చెయ్యడం కలకలం రేపింది.
ఇదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట మార్చారు. పేదలు, అణగారిన వర్గాల కోసం ఎంతో నిజాయితీగా పనిచేస్తున్న సిద్ధరామయ్యను కాపాడేందుకు మనమందరం కలిసికట్టుగా కృషి చేయాలని, ఆ దిశగా కృషి చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. తుమకూరు లోక్సభ నియోజక వర్గంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ప్రత్యక్ష పోరు నెలకొంది. బీజేపీ నుంచి వి. సోమన్న అభ్యర్థి అయితే కాంగ్రెస్ నుంచి ఎస్పీ. ముద్దహనుమే గౌడ రంగంలోకి దిగారు.

తుమకూరు లోక్ సభ నియోజక వర్గంలో కాంగ్రెస్ అధిష్టానం ఆధిక్యత కనబరుస్తున్నప్పటికీ, బీజేపీకి గట్టి పోటీ ఎదురుకానుంది. జేడీఎస్తో పొత్తు పెట్టుకోవడంతో లింగాయత్లు, ఒక్కలిగల ఓట్లను తమవైపు తిప్పుకోగలమన్న విశ్వాసంతో బీజేపీ ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి ముద్దహనుమేగౌడ 2014 నుంచి 2019 వరకు ఎంపీగా ఉండి అభివృద్ధి పనులతో నియోజకవర్గంలో మంచి ఎంపీగా గుర్తింపు తెచ్చుకున్నారు.
గత లోక్ సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో బీజేపీలో చేరిన ముద్దహనుమే గౌడ ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్లో చేరి మళ్లీ లోక్సభలో అడుగుపెట్టడం ఖాయం కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications