నమ్మకం ఉంటే బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి: బిజెపికి శివసేన సవాల్
ముంబై: శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కర్ణాటక ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. బిజెపి బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలను నిర్వహించడం ద్వారా ఈవీఎంలపై నెలకొన్న సందేహలను తీర్చాలని డిమాండ్ చేశారు.
ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో శివసేన చీఫ్ ఉథ్థవ్ ఠాక్రే ఈ సవాల్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకొంది. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలను సమర్ధిస్తూ ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే కూడ సమర్ధించారు.

కర్ణాటకలో బిజెపికి వచ్చిన సీట్లు ఈవీఎంల ద్వారా వచ్చినవని ఆయన చెప్పారు. ఈ విజయం ఈవీఎంల విజయమేనని ఆయన ఎద్దేవా చేశారు. బిజెపి ఉప ఎన్నికల్లో ఓటమి పాలౌతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం విజయం సాధిస్తోన్న విషయాన్ని ఆయన గుర్త చేశారు.
మీ మీద మీకు నమ్మకం ఉంటే బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలను నిర్వహించాలని శివసేన చీఫ్ ఉద్దర్ ఠాక్రే డిమాండ్ చేశారు.
చాలామంది బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications