కర్ణాటక ఎన్నికలు.. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా బెట్టింగ్ లు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు రేపు జరుగనున్నాయి .బిజెపి,కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించి అధికారం కోసం తలపడుతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 50 మిలియన్లకు పైగా ఓటర్లు ఉన్నారు. మే పదో తేదీన పోలింగ్ జరగనుండగా ,13వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.
కర్ణాటక ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ అగ్రనాయకులు భారీ ఎత్తున ప్రచారం నిర్వహించి తమదైన మేనిఫెస్టోలో ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేశారు.కర్ణాటక ఎన్నికలలో విచ్చల విడిగా ధనప్రవాహం కూడా సాగింది. ఇక రేపు జరగనున్న పోలింగ్లో ప్రజలు ఎవరివైపు నిలబడతారు అనేది తెలియనుంది.

అయితే కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో విజయం ఎవరిది అన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.అంతేకాదు రేపు జరగనున్న కర్ణాటక ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో జోరుగా బెట్టింగ్ లు కొనసాగుతున్నాయి. అప్పుడే బీజేపీ గెలుస్తుందని కొందరు,కాంగ్రెస్ గెలుస్తుందని మరికొందరు, జేడీఎస్ వైపు ఇంకొందరు జోరుగా పందేలు కాస్తున్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? వంటి విషయాలపై విశ్లేషణలు చేస్తున్నారు.
ఎన్నికలు జరిగే కర్ణాటక రాష్ట్రంలోనే కాక తెలుగురాష్ట్రాల్లోనూ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి ఎన్నికలు. అందుకే జోరుగా బెట్టింగ్ లు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని భీమవరం లో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నట్లు తెలుస్తుంది.ప్రధానంగా కాంగ్రెస్, బిజెపి, జేడీఎస్ లు అధికారం తమదంటే తమదని అంచనాలు వేస్తుంటే, బెట్టింగ్ రాయుళ్ళు కూడా తమదైన అంచనాలతో కోట్ల రూపాయల బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు.
దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న కర్ణాటక ఎన్నికల పోలింగ్ రేపు ఏ విధంగా సాగుతుంది? ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది? అన్నది ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠకు కారణమవుతుంది. ఈ ఎన్నికల ఫలితాలు భవిష్యత్ పార్లమెంట్ ఎన్నికలపైన కూడా ప్రభావం చూపిస్తుందని అందరూ భావిస్తున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications