మెజార్టీ ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్కే ఎక్కువ సీట్లు: జెడి (ఎస్) నిర్ణయమే కీలకం
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో శనివారం నాడు జరిగిన ఎన్నికల్లో పలు ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లను కైవసం చేసుకొంటుందని తేల్చి చెప్పాయి. రెండవ అతి పెద్ద పార్టీగా బిజెపి విజయం సాధిస్తోందని ఈ సర్వే ఫలితాలు వెల్లడించాయి అయితే ఏ పార్టీ కూడ స్పష్టమైన మెజారిటీ సీట్లను కైవసం చేసుకోబోవని తేల్చి చెప్పాయి.
కర్ణాటక అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లను కైవసం చేసుకొంటుందని ఎగ్జిట్ పోల్స్ సర్వే పలితాలు వెల్లడించాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటులో జెడి (ఎస్) కీలకంగా మారే అవకాశం ఉంది.
సీ ఓటర్ సర్వే ప్రకారంగా కాంగ్రెస్ పార్టీకి 87 నుండి 99 సీట్లు దక్కనున్నాయి. బిజెపికి 97 నుండి 109 సీట్లు దక్కనున్నాయి. జెడిఎస్ కు 21 నుండి 30 సీట్లు దక్కనున్నాయి.
ఇండియా టూడే యాక్సిస్ సర్వే ప్రకారంగా కాంగ్రెస్ పార్టీకి 106 నుండి 118 సీట్లు దక్కనున్నాయి. బిజెపికి 72 నుండి 92 సీట్లు దక్కనున్నాయి.జెడి(ఎస్)కు 22 నుండి 30 సీట్లు దక్కనున్నాయి. ఇతరులకు 1 నుండి 4 సీట్లు రానున్నాయి.
జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారంగా బిజెపికి 95 నుండి 114 సీట్లు దక్కనున్నాయని తేల్చింది.. కాంగ్రెస్ పార్టీకి 73 నుండి 82 సీట్లు దక్కుతాయని తేల్చింది.జెడి(ఎస్)కు 32 నుండి 43 సీట్లు వస్తాయని ఈ సర్వే తేల్చింది.ఇతరులకు రెండు నుండి మూడు సీట్లు దక్కే అవకాశం ఉందని ఈ సర్వే తేల్చింది.