మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ప్రత్యక్షం: విచారణ, అరెస్టు చేసుకోండి, పారిపోలేదు!
బెంగళూరు: ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు కొన్ని రోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్న కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి శనివారం సాయంత్రం బెంగళూరులోని సీసీబీ కార్యాలయంలో ప్రత్యక్షం అయ్యారు. తాను ఎక్కడికి పారిపోలేదని, అరెస్టు చేస్తారనే భయం లేదని, కావాలంటే అరెస్టు చేసుకోవాలని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.

వెంకటేశ్ ప్రసన్న
తన న్యాయవాది చంద్రశేఖర్ తదితరులను వెంటబెట్టుకుని సీసీబీ కార్యాలయంలో గాలి జనార్దన్ రెడ్డి హాజరైనారు. బెంగళూరు సీసీబీ విభాగం ఏసీపీ వెంకటేశ్ ప్రసన్న నేతృత్వంలోని అధికారులు గాలి జనార్దన్ రెడ్డిని విచారణ చేస్తున్నారు.

గాలి జనార్దన్ రెడ్డి అవునా ..కాదా
మీరు గాలి జనార్దన్ రెడ్డి అవునా ? కాదా ? అని ప్రశ్నించిన పోలీసులు ఆయన గుర్తింపు కార్డు (ఐడీ కార్డు), ఫోటో, సంతాకాలు తీసుకున్నారు. అనంతరం వీడియో చిత్రీకరణ, రాతపూర్వకంగా గాలి జనార్దన్ రెడ్డిని విచారణ చేస్తున్న పోలీసులు ఆయన స్టేట్ మెంట్ ను రికార్డు చేసుకుంటున్నారు.

వీడియో కెమెరాలు
సీసీబీ కార్యాలయంలో ప్రత్యేకంగా వీడియో కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆండిడెంట్ కంపెనీ చీటింగ్ కేసులో మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి ఎలాంటి ప్రశ్నలు వెయ్యాలి ? అంటూ సీసీబీ పోలీసు అధికారులు ముందుగానే ఓ జాబితా తయారు చేసుకున్నారని తెలిసింది.

నోటీసులు ఇవ్వలేదు
తనకు పోలీసులు నోటీసులు జారీ చెయ్యలేదని, అవన్ని పుకార్లు అని గాలి జనార్దన్ రెడ్డి అంటున్నారు. శనివారం తన న్యాయవాదికి నోటీసులు ఇచ్చిన పోలీసులు ఆదివారం లోపు విచారణకు హాజరుకావాలని సూచించారని గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు.

అరెస్టు చేసుకోండి!
ఆదివారం ఎందుకు శనివారం పోలీసుల విచారణకు హాజరుకావాలని తాను నిర్ణయించానని గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు. పోలీసులు అరెస్టు చేస్తారని తనకు భయం లేదని, కావాలంటే అరెస్టు చేసుకోవచ్చని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. నోటీసులు ఇవ్వనిదే తాను ఎందుకు విచారణకు హాజరుకావాలని గాలి జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు.

ఎందుకు పారిపోవాలి ?
పోలీసుల నుంచి తప్పించుకుని తాను ఎక్కడికి పారిపోలేదని, అంత అవసరం తనకు లేదని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలీఖాన్ సైతం శనివారం సాయంత్రం సీసీబీ పోలీసుల ముందు హాజరైనారు. గాలి జనార్దన్ రెడ్డి విచారణకు హాజరైనారని సమాచారం తెలుసుకున్న సీసీబీ విభాగం జాయిట్ పోలీసు కమీషనర్ అలోక్ కుమార్ సైతం కార్యాలయం చేరుకుని విచారణ చెయ్యడానికి సిద్దం అయ్యారు.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications