102 ఏళ్ల బామ్మకు 136 ఓట్ల మెజారిటి: బీజేపీకి షాక్

బెంగళూరు: కర్ణాటకలో రెండు విడతలలో జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దూసుకు వెళ్లింది. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి, కర్ణాటక బీజేపీ నాయకులకు పెద్ద షాక్ ఇచ్చింది. పలు చోట్ల నువ్వా నేనా అని అభ్యర్థులు పోటి పడ్డారు. లాటరీ పద్దతిలో అనేక మంది గెలుపొందారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం స్థానికంగా జరిగిన గ్రామపంచాయితీ ఎన్నికలలో పలువురు అభ్యర్థులను గెలిపించుకుంది. తరువాత రైతుల పక్షాన ఉన్న జేడీఎస్ పార్టీ సైతం పర్వాలేదనిపించుకుని పలు చోట్ల తమ అభ్యర్థులను గెలిపించుకుంది.

Karnataka Gram Panchayat Election Results 2015

అయితే ప్రధాని మోడీ జపం చేస్తున్న బీజేపీ నాయకులు మాత్రం కంగుతిన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నామనే ధీమాతో నిర్లక్షం చెయ్యడంతో రెండవ స్థానంలో నిలబడ్డారు. ఆప్ మద్దతు దారులు ముగ్గురు గెలవడంతో కర్ణాటకలో వారు ఖాతా తెరిచారు.

చామరాజనగరలో 102 సంవత్సరాల గవి తిమ్మమ్మ అనే బామ్మ 136 ఓట్లతో విజయం సాదించారు. కోప్పల జిల్లా పాలవర్తి పంచాయితీ ఎన్నికలలో పోటి చేసిన మల్లవ్వ పోలింగ్ రోజు రాత్రి పిడుగు పడి మరణించారు. అయితే ఆమె 391ఓట్ల మెజారిటితో గెలుపోందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+