మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే మీద చర్యలకు హైకోర్టు ఆదేశం, పాస్ పోర్టులో ఫోర్జరీ సంతకం ?
బెంగళూరు: భారత్ మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే మీద వచ్చిన ఫోర్జరీ సంతకం ఫిర్యాదు స్వీకరించి పరిశీలించాలని బెంగళూరులోని కోరమంగళ పాస్ పోర్టు అధికారులకు కర్ణాటక హై కోర్టు సూచించింది. ఇంతకు ముందే అనిల్ కుంబే మీద ఫిర్యాదు పరిశీలించి ఉంటే ఆ వివరాలు ఇవ్వాలని పాస్ పోర్టు అధికారులకు కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అనిల్ కుంబ్లే భార్య చేతనా మొదటి భర్త కుమార్. వి. జాగిర్ దార్ ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని కర్ణాటక హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మా ఇద్దరికి జన్మించిన ( ప్రస్తుతం అనిల్ కుంబ్లే భార్య చేతనా) అమ్మాయి పాస్ పోర్టు రెన్యువల్ చెయ్యడానికి తన సంతకాన్ని నా మాజీ భార్య ప్రస్తుత భర్త అనిల్ కుంబ్లే ఫోర్జరీ చేశారని కుమార్ వి. జాగిర్ దార్ ఫిర్యాదు చేశారు.

అయితే పాస్ పోర్టు అధికారులు తన ఫిర్యాదును పరిశీలించలేదని కుమార్ వి. జాగిర్ దార్ ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. గతంలో కుమార్ వి. జాగిర్ దార్ ఆయన మాజీ భార్య రెండవ భర్త, మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే మీద ఇచ్చిన ఫిర్యాదు ఎఫ్ఐఆర్ రద్దు అయ్యింది.
కుమార్ వి. జాగిర్ దార్ అర్జీ పరిశీలించిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి బి. వీరప్ప నేతృత్వంలోని ఏకసభ్య బెంచ్ అనిల్ కుంబ్లే మీద చర్యలు తీసుకోవాలని కోరమంగల పాస్ పోర్టు కార్యాలయం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. తన సంతకాన్ని నా మాజీ భార్య చేతనా రెండవ భర్త అనిల్ కుంబ్లే ఫోర్జరీ చేశారని 2012 జనవరి 10వ తేదీ కుమార్ వి. జాగిర్ దార్ ఫిర్యాదు చేశారు.
కుమార్ వి. జాగిర్ దార్ ఫిర్యాదును మీరు ఇంతకు ముందే పరిశీలించి ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే వివరాలు సమర్పించాలని కర్ణాటక హైకోర్టు పాస్ పార్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 1986లో కుమార్ వి. జాగిర్ దార్ ,చేతనా రామతీర్థ వివాహం జరిగింది.
కుమార్ వి. జాగిర్ దార్, చేతనా రామతీర్థ దంపతులకు అరుణి అనే కుమార్తె పుట్టింది. 1999లో కుమార్ వి. జాగిర్ దార్, చేతనా రామతీర్థ దంపతులు విడాకులు తీసుకున్నారు. అనంతరం అనిల్ కుంబ్లే చేతనాను రెండవ పెళ్లి చేసుకున్నారు. 2012లో చేతనా కుమార్తె అరుణి తన కుమార్తె అంటూ అనిల్ కుంబ్లే తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని కుమార్ వి. జాగిర్ దార్ ఫిర్యాదు చేశారు. తన మైనర్ కుమార్తె పాస్ పోర్టు రెన్యువల్ చెయ్యడానికి తన సంతకాన్ని అనిల్ కుంబ్లే ఫోర్జరీ చేశారని కుమార్ వి జాగిర్ దార్ కోర్టును ఆశ్రయించారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications