మృత్యుంజయుడు.. కూలిన భవనం కింద 62 గంటలు (వీడియో)
ధార్వాడ : అవును అతడు మృత్యుంజయుడే. చావు అంచుల దాకా వెళ్లొచ్చి క్షేమంగా బయటపడ్డవాడే. కర్ణాటకలోని ధార్వాడలో భవనం కూలిన ఘటనలో 14 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో శిథిలాల కింద చిక్కుకుపోయారు. కానీ సోము అనే వ్యక్తి 62 గంటల పాటు మృత్యువుతో పోరాడి క్షేమంగా బయటపడ్డాడు.
మావోయిస్టుల కదలికలు మళ్లీనా?.. ఎన్నికల బహిష్కరణకు తెలంగాణ కమిటీ పిలుపు
ధార్వాడలోని కుమారేశ్వర లేఅవుట్ లో నిర్మాణ దశలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం మంగళవారం కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద చాలామంది చిక్కుకున్నారు. దాంతో పోలీసులు, రెస్క్యూ సిబ్బంది మూడు రోజుల నుంచి శ్రమిస్తూ దాదాపు 70 మందిని రక్షించారు.
#WATCH Man rescued from Dharwad building collapse site today after the under-construction building collapsed on March 19. #Karnataka pic.twitter.com/ODimTCxdoG
— ANI (@ANI) March 22, 2019
మరికొంత మంది ఇంకా శిథిలాల కిందనే చిక్కుకుని ఉండటంతో వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో సోము అనే వ్యక్తిని ప్రాణాలతో కాపాడారు. శిథిలాల కింద 62 గంటల పాటు మృత్యువుతో పోరాడి సోము క్షేమంగా బయటపడటంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా, సోమును రక్షించిన వీడియోను సీనియర్ పోలీసు అధికారి ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
#dharwadbuildingcollapse
— M.N.Reddi, IPS (@DGP_FIRE) March 22, 2019
After 62 hours of being trapped in the basement of the collapsed multi storied building, Dilip being rescued alive by our Fire Force just now !!! pic.twitter.com/VildP7lPYE