డీకేకి చెక్ పెడుతున్న సీఎం వర్గం, ఢిల్లీలో తేల్చుకుంటాము, ఆయనకు ఎన్ని పదవులు ఇస్తారు ?
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నీ సరిగ్గా లేవని మంత్రులు, నేతల ప్రకటనలను బట్టి తెలుస్తోంది. మంత్రి కేఎన్ రాజన్న, సతీష్ జారకిహోళితో సహ మరికొంత మంది మంత్రులు డీసీఎం పదవులు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ను సొంత పార్టీ నాయకులు ఇరుకున పెట్టే ప్రయత్నాలు జరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత డీకే శివకుమార్ కర్ణాటక డీసీఎం అయినప్పటికీ కేపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు కేపీసీసీ అధ్యక్షుడిని మార్చకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ కమిటీలో కూడా మార్పులు ఉండదని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. డీకే శివకుమార్ కేపీసీసీ అధ్యక్షుడిగానే కాకుండా రెండు బలమైన ఖాతాలతో డీసీఎంగా పని చేస్తున్నారని సొంత పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

కేపీసీసీ కార్యాలయానికి కార్యకర్తలు రావడం లేదని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమస్యలపై డీకే శివకుమార్ స్పందించడం లేదని కాంగ్రెస్ లోని కొందరు నాయకులు ఆరోపిస్తున్నారు. ఒకటికి మూడు డీసీఎం పదవులు ఇవ్వలేమని చెప్పకండి, లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మూడు డీసీఎం పదవులు ఇవ్వాలని దళిత మంత్రి సూర్జేవాలాపై ఒత్తిడి తెస్తున్నారని తెలిసింది. దళిత మంత్రుల ఈ డిమాండ్ కారణంగా సూర్జేవాలా డైలమాలో పడ్డట్లు తెలుస్తోంది.

ఈ సమావేశంలో సతీష్ జారకిహోళి మాట్లాడుతూ మరో మూడు డీసీఎం పదవులు ఇవ్వాలని హైకమాండ్ కు మనవి చేశారని తెలిసింది. లోక్సభ ఎన్నికలకు ముందు మూడు డీసీఎం పదవులు ఇవ్వాలని కేఎన్ రాజన్న హైకమాండ్ కు చెప్పినట్లు సమాచారం.
మీరు మీడియా ప్రకటన చాలా ఎక్కువగా ఇస్తున్నారని, మీరు అన్నివేళలా ఇలా ప్రకటనలు చేయవద్దు అని రణదీప్ సింగ్ సూర్జేవాలా ఆయనకు చెప్పడంతో మరో మంత్రి కేహెచ్ మునియప్ప జోక్యం చేసుకున్నారని తెలిసింది.
డీకే శివకుమార్కు రెండు ఖాతాలు ఉన్నప్పటికీ అనవసరంగా ఇతర శాఖ జోక్యం చేసుకుంటున్నారని డాక్టర్ హెచ్సీ మహదేవప్ప కాంగ్రెస్ హైకమాండ్ ముందు ఆవేదన వ్యక్తం చేశారని తెలిసింది.
లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయని, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేపీసీసీ నుంచి ఎలాంటి కార్యాచరణ లేదని మంత్రులు దినేష్ గుండూరావు, ఎంబీ పాటిల్ ఆరోపించారని తెలిసింది. సీఎం సిద్దరామయ్యకు అత్యంత సన్నిహితులు అయిన మంత్రులు డీకే శివకుమార్పై ఫిర్యాదుల వర్షం కురిపించినట్లు తెలిసింది.

మీ డిమాండ్ను హైకమాండ్కి తెలియజేస్తానని, జనవరి 11వ తేదీన మీరు ఢిల్లీకి రండి అని, మనం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే, రాహుల్ గాంధీలతో మాట్లాడదాం అని, కానీ మీడియా ముందు బహిరంగ ప్రకటనలు చేసి గందరగోళం సృష్టించవద్దని రణదీప్ సూర్జేవాలా కర్ణాటక మంత్రులను హెచ్చరించాని తెలిసింది. డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమస్యలపై సరిగా స్పందించడం లేదని కొందరు మంత్రులు ఆరోపించారు.
రెండు ప్రధాన ఖాతాలు ఉన్నప్పటికీ డీకే శివకుమార్ ఇతర విభాగాల్లో పనిచేస్తున్నారని, ప్రభుత్వం వచ్చాక కేపీసీసీ కార్యకలాపాలలో ఎలాంటి కార్యాచరణ చేయలేదని, పార్టీ కార్యకర్తలు మా వద్దకు వస్తే ఏ కష్టం చెప్పకండి అని వెనక్కి పంపిస్తున్నారని, మంత్రులు సతీష్ జారకిహోళి, హెచ్సీ మహదేవప్ప, కేహెచ్ మునియప్ప, కేఎన్ రాజన్న, దినేష్ గుండూరావు, ఎంబి పాటిల్ లు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు డీకే శివకుమార్ మీద ఫిర్యాదు చేశారని ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు అంటున్నారు,
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications