మరదలి కోసం ఎంతపని చేశాడంటే ?, క్రికెట్ బ్యాట్ తీసుకుని భార్యను ?, బెడ్ మీద వీడియో వైరల్ !
ఇన్స్టాగ్రామ్ రీల్స్ను పురుషుల కంటే మహిళలు ఎక్కువగా తయారు చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసి వైరల్ చేస్తున్నారు. భర్తను డామినేట్ చేస్తున్న భార్య ప్రతిరోజు రీల్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నది. భార్య మీద మోజు తీర్చుకున్న భర్త అతని మరదలి మీద కన్ను వేశాడు. భార్య చెల్లిని దక్కించుకోవాలని ప్లాన్ చేసిన భర్త అతని భార్యను, ఏడాది వయసున్న కూతురిని క్రికెట్ బ్యాట్తో కొట్టి చంపేసి ఓ సినిమా కథ అల్లాడు.
ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్లో ఓ వ్యక్తి తన అందమైన భార్య, ఏడాది వయసున్న కూతురిని దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. భార్యను వదిలించుకుని ఆమె చెల్లిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందు కోసం కట్టుకున్న భార్యను, కూతురు ఇద్దరినీ దారుణంగా హత్య చేశాడు. సినిమా స్కెచ్ వేసిన భర్త అతని భార్య, కుమార్తెను క్రికెట్ బ్యాట్తో కొట్టి చంపాడు. పోలీసుల దర్యాప్తును తప్పుదోవ పట్టించడానికి దొంగతనం కథను అల్లాడు.

భార్య, కూతురిని హత్య చేసిన వ్యక్తి పేరు నీరజ్ కుష్వాహ. ఉత్తరప్రదేశ్ లోని లలిత్పూర్లోని సదర్ కొత్వాలి ప్రాంతంలోని చందమారి గ్రామంలో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. నీరజ్ ఇంట్లో నుంచి భార్య, కుమార్తె మృతదేహాలు లభ్యమయ్యాయి. ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు తన ఇంట్లోకి ప్రవేశించి తన భార్య, కుమార్తెపై దాడి చేసి హత్య చేశారని నీరజ్ కుష్వాహా పోలీసులకు సమాచారం అందించాడు.
వేకువ జామున 1.30 గంటల సమయంలో ఆరుగురు దుండగులు మా ఇంట్లోకి చొరబడ్డారని, ఆ సమయంలో భార్య, కూతురిని హత్య చేసి నా నోట్లో సాక్స్ లు కుక్కి నగదు, బంగారు నగలు దోచుకుని పారిపోయారని నీరజ్ పోలీసులకు చెప్పాడు. తన చేతులతో తన కుమార్తెను, భార్యను హత్య చేసి దోపిడీకి పాల్పడిన నీరజ్ కుష్వాహా తరువాత ఎవరికి అనుమానం రాకుండా అతని శరీరం మీద గాయాలు చేసుకుని ఆసుపత్రిలో చేరాడు. ఆస్పత్రి బెడ్పై గాయపడిన అతడు పోలీసులకు వాంగ్మూలం ఇస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

అయితే నీరజ్ కుష్వాహ మాటలపై పోలీసులకు అనుమానం వచ్చింది. నీరజ్ ను అదుపులోకి తీసుకుని బెండ్ తీసి విచారించగా తానే జంట హత్యలు చేసినట్లు ఒప్పుకున్నాడు. నా భార్య అందంగా ఉంది, కేవలం రీల్స్ మాత్రమే చేస్తోందని, నా గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని నీరజ్ కుష్వాహ పోలీసుల విచారణలో అంగీకరించాడు. నా భర్త అందంగా ఉండటంతో ఆమె రీల్స్ చాలా మంది చూస్తున్నారని, అయితే ఆమె రోజూ రీళ్లు చేసుకుంటూ గడిపేదని, ఇందుకోసం ఆమెను వదిలించుకుని ఆమె చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నానని నీరజ్ పోలీసులకు చెప్పాడు.
నేను నా మరదలిని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం నా భార్యకు నచ్చలేదని, అందుకే ఆమెను క్రికెట్ బ్యాట్తో కొట్టి చంపాశానని, హత్య కేసుల నుంచి తప్పించుకోవడానికి దొంగతనం కథ అల్లి ఎవరికీ అనుమానం రాకుండా చూసుకున్నానని. తన ఇంట్లో చోరీ జరిగినట్లు ప్లాన్ చేశానని, ఇంట్లోని సామాన్లన్నింటినీ పగులగొట్టి, బంగారు ఆభరణాలను ఇంట్లోని టీవీ వెనుక దాచిపెట్టానని నీరజ్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. పోలీసులు నీరజ్ పన్నిన పన్నాగాన్ని బట్టబయలు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ జంట హత్య కేసును ఛేదించిన పోలీసు బృందానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. 25, 000 రూపాయల రివార్డు ప్రకటించింది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications