అసెంబ్లీ ఎన్నికల వేళ- బీజేపీ యువ నేత దారుణ హత్య
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల వేళ.. కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ధార్వాడ నియోజకవర్గానికి చెందిన భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకుడొకరు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనతో ధార్వాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హతుడి పేరు ప్రవీణ్ కమ్మర్. వయస్సు 34 సంవత్సరాలు. నియోజకవర్గం పరిధిలోని కొత్తూరు ఆయన స్వగ్రామం. ఈ గ్రామ పంచాయతీ ఉపాధ్యక్షుడు కూడా. మంగళవారం కొత్తూరు గ్రామంలో వెలిసిన ఉడచమ్మ దేవి ఉత్సవాల సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణల్లో ప్రవీణ్ కమ్మర్ను నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ప్రతి సంవత్సరం ఉడచమ్మ దేవి జాతరను నిర్వహిస్తుంటారు. వందలాదిమంది భక్తులు దీనికి హాజరవుతుంటారు.

పొరుగు జిల్లా నుంచి ఉత్సవాలను తిలకించడానికి వచ్చిన నలుగురు వ్యక్తులు ప్రవీణ్ కమ్మర్పై దాడి చేసి, కత్తులతో పొడిచినట్లు ధార్వాడ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ బీ లోకేష్ తెలిపారు. మద్యం మత్తులో అమ్మవారి జాతరలో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తోన్న వారిని ప్రవీణ్ కమ్మర్ అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణలో వారు ప్రవీణ్పై కత్తులతో దాడి చేసినట్లు ఎస్పీ చెప్పారు.
రక్తపుమడుగులో పడి ఉన్న ఆయనను హుటాహుటిన హుబ్లీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ ఉదయం మరణించారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే బీజేపీ యువ మోర్చా నాయకులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. అటు కొత్తూరు గ్రామంలో కూడా ఉద్రిక్ర పరిస్థితులు నెలకొన్నాయి. దీనితో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ బలగాలను మోహరింపజేశారు.
ప్రవీణ్ కమ్మర్ హత్య పట్ల బీజేపీ జాతీయ యువ మోర్చా అధ్యక్షుడు, బెంగళూరు సౌత్ లోక్ సభ సభ్యుడు తేజస్వి సూర్య దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బీజేవైఎం ధార్వాడకు చెందిన ప్రవీణ్ కమ్మర్ హత్యోదంతం తనను కలచి వేసిందని అన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను దారుణంగా హత్య చేశారని, హంతకులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తేజస్వి సూర్య ఓ ట్వీట్ చేశారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications