Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బహిరంగ సమావేశానికి పిలిచి మాజీ సీఎంను ఏం చేశారంటే, ఇంత అవసరమా ?

బెంగళూరు/విజయపురం: కర్ణాటకలో బీజేపీకి అధికారం దూరం కావడంతో ఆ పార్టీ కార్యకర్తలు సహనం కోల్పోతున్నారు. కర్ణాటకలోని విజయపుర నగరంలో సోమవారం జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. విజయపుర నగర బీజేపీ ఎమ్మెల్యే బసన్ గౌడ పాటిల్ యత్నాల్ మద్దతుదారులు బీజేపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లర్లను అదుపు చేయడంలో పోలీసులు కూడా విఫలం అయ్యారు.

ఇదంతా మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ సమక్షంలోనే జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ఇతర బీజేపీ నేతలు విజయపురకు తరలివచ్చారు. ఈ సందర్భంగా వేదికపై విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ లేరు. యత్నాల్ వేదికపైకి వచ్చే వరకు కార్యక్రమాన్ని ప్రారంభించవద్దని మద్దతుదారులు పట్టుబట్టారు. అక్కడే గొడవ ఎక్కువ అయ్యింది.

Karnataka

బసవన గౌడ యత్నాల్‌ తరపున మద్దతుదారులు బీఆర్‌పీ, బీఆర్‌పీ అంటూ నినాదాలు చేశారు. యత్నాల్‌కు వ్యతిరేకంగా పనిచేసిన నేతలను వేదికపై కూర్చోబెడుతున్నారు. వారిని బయటకు తీసుకురావాలని ఆగ్రహంతో నినాదాలు చేశారు. ద్రోహం చేసే వారిని స్టేజ్ మీద కుర్చో బెడితే సహించే ప్రశ్నే లేదని యత్నాల్ వర్గీయులు నినాదాలు చేశారు.

వేదికపై ఉన్న విజయపుర ఎంపీ రమేష్ జిగజినాగి, పరిశ్రమల శాఖ మాజీ మంత్రి మురుగేష్ నిరాణిలకు వ్యతిరేకంగా మద్దతుదారులు నినాదాలు చేయడం ప్రారంభించారు. సమావేశంలో తీవ్ర సందడి వాతావరణం నెలకొంది. పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన బీజేపీ సీనియర్ నేతలు వెంటనే వేదిక దిగి వెళ్లిపోయారు.

Karnataka

వాకౌట్ చేసిన వారిలో మురుగేష్ నిరాణి, ఎంపీ రమేశ్ జిగజినాగి, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ పాటిల్ నడహళ్లి, శాసనమండలి సభ్యుడు హనుమంత్ నిరాణి ఉన్నారు. యత్నాల్ మద్దతుదారులను అదుపు చేసేందుకు పోలీసులు, బీజేపీ నేతలు నానా తంటాలు పడ్డారు. ఈ ఘటనలన్నీ చూస్తూ మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ మౌనంగా కూర్చున్నారు. ఈ సమయంలో చిక్కోడి లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ అన్నాసాహెబా జొల్లె, ఎమ్మెల్యే అభయ్‌పాటిల్‌తోపాటు పలువురు నేతలు వేదికపై ఉన్నారు.

వీరన్న చరంతిమఠం ఓటమికి ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం బాగల్‌కోట్‌లో జరిగిన బీజేపీ జిల్లా నేతల సమావేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ మంత్రులు గోవింద్‌ కారజోల, మురుగేష్‌ నిరానీ సమక్షంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏర్పాటై తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం బీజేపీ బాగల్‌కోట్‌ జిల్లా విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.

Karnataka

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్, విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ హాజరయ్యారు. నాయకులు సంఘటనా స్థలానికి చేరుకోకముందే బీజేపీ అభ్యర్థి ఓటమికి ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. బీజేపీ ఎమ్మెల్సీ పీహెచ్‌ పూజకు మద్దతుదారులు చరంటిమఠంపై పని చేస్తున్నారని వీరన్న ఆరోపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+