ఆస్పత్రి నుంచి కరుణానిధి డిశ్చార్జ్: ‘విశ్రాంతి తీసుకోవాలి’
చెన్నై: కొద్ది రోజులుగా చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడింది. దీంతో తాను చికిత్స పొందిన కావేరీ హాస్పిటల్ నుంచి బుధవారం రాత్రి కరుణానిధి డిశ్చార్జ్ అయ్యారు.
డీఎంకే చీఫ్ ఆరోగ్యం మెరుగైందని అందుకే ఆయనను డిశ్చార్జ్ కావాలని సూచించినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చినట్లు వైద్యులు చెప్పారు.

మరోవైపు కరుణానిధి అనారోగ్యం కోలుకుని ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్తున్నారన్న విషయం తెలియగానే డీఎంకే నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. డిసెంబర్ 1వ తేదీన డీహైడ్రేషన్, అలర్జీ సంబంధిత అనారోగ్య కారణాలతో కరుణానిధి చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications