వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉదయాన్నే ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రదాడి, ఇద్దరు ఉగ్రవాదుల్ని చంపిన సైన్యం

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: పాకిస్తాన్ - భారత్ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. జమ్ము కాశ్మీర్‌లోని హంద్వారాలో మిలిటెంట్స్ ఆర్మీ క్యాంప్ పైన దాడి చేశారు. దాదాపు ఇరవై నిమిషాల పాటు ఈ కాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు.

హంద్వారాలోని రాష్ట్రీయ రైఫిల్ క్యాంప్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు మృతి చెందారు. ఈ కాల్పులు గురువారం వేకువజామున ఐదు గంటలకు జరిగింది.

Jammu Kashmir

సరిహద్దుల్లో మనం సైన్యం అప్రమత్తంగా ఉంది. మిలిటెంట్లు కాల్పులు జరపగానే వెంటనే ఎదురుదాడి చేసి వారిని చిత్తు చేశారు. కాగా, ఆర్మీ క్యాంప్ పైన దాడి జరగడం గత మూడు వారాల్లో ఇది మూడోసారి. యూరి ఉగ్రదాడిలో 19 మంది సైనికులు అమరులైన విషయం తెలిసిందే. ఆ తర్వాత గత ఆదివారం బారాముల్లా క్యాంప్ వద్ద దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ సైనికుడు అమరుడయ్యారు. తీవ్రవాదులు తప్పించుకున్నారు.

English summary
Two militants have been killed by alert soldiers at the army camp, Langate in Handwara, Jammu and Kashmir. At around 5 AM, terrorists opened fire on the army camp. However the alert soldiers fired upon the terrorists and prevented them from breaching the camp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X