వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Terrorists: రెచ్చిపోయిన ఉగ్రవాదులు, జవాన్లు, కాశ్మీర్ పండిట్ పై కాల్పులు, వలస కార్మికులను వదల్తేదు !

|
Google Oneindia TeluguNews

కాశ్మీర్: కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సీఆర్ పీఎఫ్ జవాన్లు, వసల కార్మీకుల మీద ఉగ్రవాదులు కాల్పులు జరిపారు, 24 గంటల వ్యవదిలో మూడు ప్రాంతాల్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోవడంతో భారత జవాన్లు రంగంలోకి దిగారు. మైసుమా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న భారత జవాన్లు ఉగ్రవాదుల కోసం జల్లెడపడుతున్నారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక జవాను వీరమణం పొందారు, మరో జవానుకు తీవ్రగాయాలైనాయి. మరో ప్రాంతంలో జరిపిన కాల్పుల్లో కాశ్మీర్ పండిట్ కు తీవ్రగాయాలైనాయి. మరో ప్రాంతంలో ఇద్దరు బీహారీ కార్మికులకు తీవ్రగాయాలైనాయి. ఉగ్రవాదుల దాడులను జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా తదితరులు తీవ్రస్థాయిలో ఖండించారు.

Illegal affair: ఫేమస్ పాన్ మసాలా బిజినెస్ మెన్ భార్య, భర్తకు పాన్ మసాలా, పనోడికి మిడ్ నైట్ మసాలా!Illegal affair: ఫేమస్ పాన్ మసాలా బిజినెస్ మెన్ భార్య, భర్తకు పాన్ మసాలా, పనోడికి మిడ్ నైట్ మసాలా!

 రెచ్చిపోయిన ఉగ్రవాదులు

రెచ్చిపోయిన ఉగ్రవాదులు

జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సీఆర్ పీఎఫ్ జవాన్లు, వసల కార్మీకుల మీద ఉగ్రవాదులు కాల్పులు జరిపారు, 24 గంటల వ్యవదిలో మూడు ప్రాంతాల్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోవడంతో భారత జవాన్లు రంగంలోకి దిగారు.

 జవాన్లను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు

జవాన్లను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు

సోమవారం శ్రీనగర్ సమీపంలోని మైసుమా ప్రాంతంలో వెలుతున్న సీఆర్ పీఎఫ్ జవాన్లు మీద ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు దాడులు చెయ్యడంతో ఒక్కసారిగా జవాన్లు ఎదరు కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక జవాను వీరమరణం పొందారు. మరో జవానుకు తీవ్రగాయాలు కావడంతో ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

 జల్లెడ పడుతున్న జవాన్లు

జల్లెడ పడుతున్న జవాన్లు

కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోవడంతో భారత జవాన్లు రంగంలోకి దిగారు. మైసుమా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న భారత జవాన్లు ఉగ్రవాదుల కోసం జల్లెడపడుతున్నారు. ఉగ్రవాదులు తప్పించుకోకుండా ఆపరిసర ప్రాంతాలలో జవాన్లు గాలిస్తున్నారు.

 వలస కార్మికులపై ఉగ్రపంజా

వలస కార్మికులపై ఉగ్రపంజా

మరో ప్రాంతంలో జరిపిన కాల్పుల్లో కాశ్మీర్ పండిట్ కు తీవ్రగాయాలైనాయి. పూల్వామా జిల్లాలోని లజూరా ప్రాంతంలో బీహారీ కార్మికుల మీద ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో పట్లేశ్వర్ కుమార్, జాకో చౌదరీలకు తీవ్రగాయాలైనాయని పోలీసు అధికారులు తెలిపారు. పుల్వామాలోని నౌపోరా ప్రాంతంలోని పంజాబ్ కు చెందిన వలస కార్మికుల మీద ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. 24 గంటల్లో మూడు ప్రాంతాల్లో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల దాడులను జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా తదితరులు తీవ్రస్థాయిలో ఖండించారు.

English summary
Kashmir: Terrorists shot at a shopkeeper in Chotogam area of South Kashmir's Shopian district on Monday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X