సిగ్గుచేటు, ప్రపంచంలో అందమైనది చిన్నారి నవ్వు: కథువా అత్యాచారంపై రాష్ట్రపతి కోవింద్
కత్రా: కథువా అత్యాచారం సిగ్గుచేటు అని, మహిళలు అందరికీ భద్రత కల్పించడం మన బాధ్యత అని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బుధవారం అన్నారు. ఇటీవల కథువా, ఉన్నావ్ అత్యాచార కేసులు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కత్రాలోని శ్రీమాతా వైష్ణోదేవీ యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు.
స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏళ్లు అయిందని, ఇప్పటికీ ఇలాంటి సంఘటనలు ఎంతో సిగ్గుచేటు అన్నారు. మనం ఎలాంటి సమాజాన్ని తయారు చేస్తున్నామో గుర్తుంచుకోవాలన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని చెప్పారు.

ప్రపంచంలో అన్నింటి కంటే అందమైనది చిన్నారి నవ్వు ముఖం అన్నారు. అలాంటి చిన్నారులకు భద్రత కల్పించడమే మన పెద్ద లక్ష్యం అన్నారు. ఇది మన బాధ్యత అన్నారు.
వివిధ రంగాల్లో మహిళలు ప్రతిభ కనబర్చడంపై రాష్ట్రపతి మాట్లాడుతూ... కామన్వెల్త్ గేమ్స్లో మన అమ్మాయిలు దేశం గర్వించేలా చేశారన్నారు. తెలంగాణ నుంచిసైనా నెహ్వాల్, పంజాబ్ నుంచి హీనా సిద్ధూ, మణిపూర్ నుంచి సంగీతా చాను, మీరాబాయి చాను, మేరీకోమ్, ఢిల్లీ నుంచి మానికా బాత్రాలు భారత్ను గర్వించేలా చేశారన్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications