కేబీసీలో అమితాబ్తో డ్యాన్సు, అధికారులకు నోటీసులు

వివరాల్లోకి వెళితే ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్పూర్లో జరిగిన కేబీసీ షో రికార్డింగ్లో అదనపు కార్యదర్శి ఎంకే రౌత్, జాయింట్ సెక్రటరీ విక్రమ్ సిసోడియా (ఈయన సీఎం రమణ్ సింగ్ పేషీలో ఓఎస్డీ కూడా) పాల్గొన్నారు. కార్యక్రమం మధ్యలో వీరు వేదికపైకి వెళ్ళి అమితాబ్ తో కలిసి 'మేరే అంగనే మే తుమ్హారా క్యా కామ్ హై' పాటకు డ్యాన్సు చేశారు.
ఆ డ్యాన్స్ ఇప్పుడు వీరికి చిక్కులు తెచ్చిపెట్టింది. ఈ డ్యాన్స్పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఆగ్రహించారని సమాచారం. సీఏం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివేక్ చంద్ వీరిద్దరినీ మందలిస్తూ నోటీసులు పంపారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం చేయరాదంటూ ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. కాగా, కౌన్ బనేగా కరోడ్ పతి (కేబీసీ) రాయ్ పూర్ ఎపిసోడ్ ఇంకా ప్రసారం కాలేదు. ఈ ఇరువురు అధికారులపై కొందరు చేసిన ఫిర్యాదుల కారణంగానే సీఎం రమణ్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications