తమిళనాడు, కేరళ సీఎంలు చెన్నైలో భేటీ: 120 ఏళ్ల ములై పెరియార్ డ్యాం విషయంలో చర్చ!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ భేటీ అయ్యారు. ఎంతో కాలంగా వివాదంగా ఉన్న ములై పెరియార్ డ్యాం విషయంలో పరిష్కారం కోసం తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులు చర్చిస్తున్నారని తెలిసింది.
రాజకీయ సుడిగుండంలో తమిళనాడు సీఎం: కావేరీ నీటిలో కూల్ గా మహా పుష్కర స్నానం!
గురువారం చెన్నై చేరుకున్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేరుగా సచివాలయం చేరుకుని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి చాంబర్ కు వెళ్లారు. కేరళ సీఎంను ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.
కేరళలోని ములై పెరియా డ్యాం విషయంలో ఇరు రాష్ట్రా మధ్య వివాదం ఉంది. సుప్రీం కోర్టులో సుదీర్ఘంగా రెండు రాష్ట్రాలు ములై పెరియార్ డ్యాం మరమత్తుల పనులు, డ్యాం ఎత్తు పెంచే విషయంలో కోర్టులో వాదించుకున్నాయి. 1886లో ములై పెరియార్ డ్యాంను బ్రిటీష్ పాలకులు పెరియార్ నది కింద ప్రారంభించి 1895లో పూర్తి చేశారు. కేరళ, తమిళనాడు ముఖ్యమంత్రులు ములై పెరియాడ్ డ్యాం విషయం పరిష్కారానికి చర్చలు మొదలు పెట్టారు.