NITI Aayog health index 2021-కేరళ టాప్-యూపీ లాస్ట్- తెలంగాణపైకి-ఏపీ కిందకు
కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటించిన నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్ ర్యాంకులు ప్రస్తుతం దేశంలో ఆరోగ్య పరిస్ధితుల్ని కళ్లకు కట్టాయి. నీతి ఆయోగ్ ఇచ్చిన ప్రమాణాల్ని అందుకోవడంలో కొన్ని రాష్ట్రాలు మెరుగైన పనితీరును కనబరిచి టాప్ లో నిలవగా.. మరికొన్ని రాష్ట్రాలు మాత్రం అట్టడుగుకు చేరాయి. తెలుగు రాష్ట్రాలు తమ స్ధానాల్ని పరస్పరం మార్చుకున్నాయి. 2019-20 సంవత్సరానికి ప్రకటించిన ఈ ర్యాంకుల్లో పలు విశేషాలున్నాయి.

నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్ 2021
కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్ తాజా ర్యాంకులు ఇవాళ విడుదలయ్యాయి. ప్రతీ ఏటా కేంద్రం ఇచ్చే ఆరోగ్య ప్రమాణాల లక్ష్యాలను అందుకున్న రాష్ట్రాలకు వరుసగా ర్యాంకులు కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ కేంద్రం 2019-20 సంవత్సరానికి హెల్త్ ఇండెక్స్ ర్యాంకుల్ని ఇవాళ ప్రకటించింది. ఇందులో వివిధ రాష్ట్రాల్లో ఆరోగ్య ప్రమాణాలు, వాటిని అందుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు స్పష్టమయ్యాయి. మొత్తం నాలుగు విభాగాల్లో ప్రకటించిన ర్యాంకుల వివరాలు ఇలా ఉన్నాయి.

ఆరోగ్యంలో కేరళ టాప్, యూపీ లాస్ట్
కేంద్రం ప్రకటించిన నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్ ర్యాంకుల్లో పెద్ద రాష్ట్రాల జాబితాలో కేరళ అగ్రస్ధానంలో నిలిచింది. ఆ తర్వాత స్ధానాల్లో తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నిలిచాయి. ఈ ర్యాంకుల్లో చివరిస్ధానంలో యూపీ నిలిచింది. ఏపీ తర్వాత స్ధానాల్లో మహారాష్ట్ర, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, కర్నాటక రాష్ట్రాలు ఉన్నాయి. అలాగే చిన్న రాష్ట్రాల హెల్త్ ఇండెక్స్ జాబితాలో మిజోరం, త్రిపుర, సిక్కిం వరుసగా టాప్ 3లో నిలిచాయి. ఢిల్లీ, జమ్మూ కశ్మీర్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ జాబితాలో అట్టడుగున ఉన్నప్పటికీ గతంతో పోలిస్తే మెరుగుపడ్డాయి.

నీతి ఆయోగ్ రిపోర్ట్ లో కీలకాంశాలు
గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశం గణనీయమైన ఆర్థిక వృద్ధిని చవిచూస్తున్నప్పటికీ, జనాభా ఆరోగ్యంలో మన విజయాలు వేగాన్ని అందుకోలేకపోయాయని నీతి ఆయోగ్ తన వెబ్సైట్లో పేర్కొంది. 2015లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లచే ఏకగ్రీవంగా ఆమోదించబడిన జాతీయ అభివృద్ధి ఎజెండా ప్రకారం, ఆరోగ్యం, పోషకాహారం, విద్య, మహిళలు, పిల్లలు ప్రాధాన్యతా రంగాలుగా గుర్తించారు. జాతీయ అభివృద్ధి ఎజెండాను సాధించడానికి ఈ రంగాలలో వేగవంతమైన అభివృద్ధి తప్పనిసరిని పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య బాధ్యతను పంచుకున్నప్పటికీ, ఆరోగ్యం రాష్ట్ర అంశం అయినప్పటికీ, ఈ ప్రాంతంలో అమలు చేయడం ఎక్కువగా రాష్ట్రాలచే చేయబడుతుంది.
ఇతర దేశాలతో కలిసి, భారతదేశం పేదరికాన్ని అంతం చేయడానికి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి, 2030 నాటికి కొత్త ప్రపంచ స్థిరమైన అభివృద్ధి ఎజెండాలో ఒక భాగంగా అందరికీ శ్రేయస్సును నిర్ధారించడానికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను స్వీకరించడానికి కట్టుబడి ఉంది.
-
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications