సంపూర్ణ ప్రాథమిక విద్య: తొలి రాష్ట్రంగా కేరళ
తిరువనంతపురం: అక్షరాస్యతలో కేరళ రాష్ట్రం మరో ఘనతను సొంతం చేసుకుంది. దేశంలో ‘సంపూర్ణ ప్రాథమిక విద్య'ను సాధించిన తొలి రాష్ట్రంగా అవతరించింది. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా ప్రకటించారు.
ఇది చరిత్రాత్మక విజయమని ఆయన అభివర్ణించారు. ‘కేరళ 1991లో ఏప్రిల్ 18న సంపూర్ణ అక్షరాస్యతను సాధించినట్టు ప్రకటించింది. కేరళకు ఆరోజు మాదిరిగానే ఈరోజూ చరిత్రాత్మకమైంది. ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచింది' అని అన్సారీ కొనియాడారు.

సంపూర్ణ ప్రాథమిక విద్యను సాధించే లక్ష్యంతో కేరళ ‘అతుల్యమ్' కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా 15-50 మధ్య వయసు వారందరికీ నాలుగో తరగతితో సమానమైన విద్యను అందించాలని సంకల్పించింది. దీన్ని కేరళ విజయవంతంగా పూర్తి చేసిందని, ఇది కేరళ విద్యా కిరీటంలో కలికితురాయిగా నిలుస్తుందని అన్సారీ పేర్కొన్నారు.
ఎంతో ప్రణాళికా బద్ధంగా చేసిన అనేక కార్యక్రమాలు కేరళను సంపూర్ణ ప్రాథమిక విద్య అందించిన రాష్ట్రంగా నిలిపాయని అన్నారు. ఈ సందర్భంగా కేరళ స్టేట్ లిటరసీ మిషన్ అథారిటీని హమీద్ అన్సారీ అభినందించారు.
-
మంత్రి రాస'లీలలు'.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య! -
"ఆ మంత్రికి మహిళలంటే పిచ్చి.. 5 వేల మందితో అఫైర్" -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన!












Click it and Unblock the Notifications