కేరళ విపత్తు: అధికారుల కక్కుర్తి! సహాయ సామాగ్రిని మాయం చేస్తూ.. అరెస్ట్
తిరువనంతపురం: భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళను ఆదుకునేందుకు ఇతర రాష్ట్రాలు, కేంద్రం, సినీ ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వ అధికారులు.. వారికి అందాల్సిన సహాయక సామాగ్రిని మాయం చేస్తూ చేతివాటం ప్రదర్శించారు. దీన్ని గుర్తించిన పోలీసులు వారిని కటకటాల వెనక్కినెట్టారు.
ఆ వివరాల్లోకి వెళితే.. వయనాడ్ జిల్లాకు చెందిన థామస్, దినేష్ ప్రభుత్వ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ పనమరామ్ గ్రామంలో ఏర్పాటు చేసిన సహాయక శిబిరం వద్దకు వెళ్లి అక్కడి సహాయక సామాగ్రిని వాహనంలోకి ఎక్కిస్తుండగా అడ్డుకున్నారు. దీంతో ఈ సామాగ్రిని మరో శిబిరానికి తీసుకెళ్తున్నామని ప్రజలకు నమ్మబలికారు.

అయితే, వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది.
స్వలాభం కోసం సామాగ్రిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు తేలడంతో థామస్, దినేశ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. చెంగనూర్ ప్రాంతంలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. సహాయక సామాగ్రిని దొంగతనంగా తరలిస్తున్న తాత్కాలిక ప్రభుత్వ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications