లినీ కుటుంబానికి సర్కార్ బాసట, భర్తకు ఉద్యోగం,రూ. 20 లక్షల పరిహారం
తిరువనంతపురం :నిపా పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తూ అదే వ్యాధికి గురైన లిని అనే నర్సు కేరళలో మృతి చెందింది. అయితే లినీ కుటుంబానికి కేరళ ప్రభుత్వం అండగా ఉంటామని ప్రకటించింది. నర్సు లినీ భర్త సజీశ్కు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇద్దరు పిల్లలకు చెరో రూ.10 లక్షలను కేటాయించనున్నట్టు సీఎం విజయన్ ప్రకటించారు.
Recommended Video

కేరళ మంత్రివర్గం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకొంది. ప్రాణాలను ఫణంగా పెట్టి లినీ తన వృత్తిని నిర్వహించిన విషయాన్ని కేరళ సర్కార్ ప్రస్తావించింది. దీంతో లినీ భర్తకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు వారి ఇద్దరు పిల్లలకు కూడ రూ.10 లక్షల చొప్పున పరిహారాన్ని చెల్లించాలని సర్కార్ నిర్ణయం తీసుకొంది.

నిపా వైరస్ వ్యాధిబారిన పడి మరణించిన కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహరాన్ని చెల్లించనున్నట్టు కేరళ ప్రభుత్వం డిసైడ్ చేసింది. కోజికోడ్ లో పెరంబరా ఆసుపత్రిలో నిపా వైరస్ సోకిన బాధితులకు చికిత్స అందించిన లినీ ఈ వ్యాధి బారిన పడింది.
ఈ వ్యాధికి గురైన లినీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడింది. అయితే మరణించడానికి ముందు ఆమె తన భర్తకు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారడం తెలిసిందే.
నిపా వైరస్ కేసులు సుమారు 13కి పైగా నమోదయ్యాయి. సుమారు 10 మంది ఈ వ్యాధి కారణంగా మృత్యువాతపడ్డారని కేరళ అధికారులు ప్రకటించారు. ఈ వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు చర్యలు తీసుకొంటున్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications