కేరళలో తగ్గిన కరోనా.. 15 వేల కేసులు, 214 మంది మృతి
కేరళలో కరోనా ఉధృతి తగ్గుతోంది. 20 వేల వరకు ఉండే కేసులు అప్పుడప్పుడు 15 వేల కేసులు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం వరకు భారీగా నమోదైన రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య.. గత రెండు రోజులుగా 15 వేలలనే ఉంది. ఇవాళ కూడా కొత్తగా 15,768 మందికి కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. కరోనా మహమ్మారి బారి నుంచి రికవరీ అయిన వారి సంఖ్య కూడా ఇవాళ 21,367గా నమోదైంది. దాంతో మొత్తం రికవరీల సంఖ్య 43,54,264కు పెరిగింది.
ఇక కరోనా మరణాలు కూడా కేరళలో ఎక్కువగా వస్తున్నాయి. ఇవాళ కూడా కొత్తగా 214 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 23,897కు పెరిగింది. ఇవాళ మొత్తం 1,05,513 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. అందులో 15,768 మందికి పాజిటివ్ వచ్చింది.
ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు.
ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు థర్డ్ వేవ్ అని నిపుణులు చెప్పడంతో భయాందోళన నెలకొంది.