సబ్బు వాడినా అందం ఇవ్వలేదు, పరిహారం వచ్చింది
తిరువనంతపురం: మా ప్రోడక్ట్ వాడి అందంగా మారండి అంటూ ఊదరగొట్టే యాడ్లను రోజు చూస్తుంటాం. వాటిని మనం ఎవరు కూడా సీరియస్గా తీసుకోమనే చెప్పవచ్చు. కానీ ఓ అడ్వర్టయిజ్మెంటును సీరియస్గా తీసుకున్న శిల్పి ఏకంగా సబ్బును వాడి, ఆ తర్వాత అది పని చేయకపోవడంతో కోర్టుకెక్కారు.
దీంతో, 'మా సబ్బు వాడండి అందం వెతుక్కుంటూ వస్తుందం'టూ ప్రకటనలతో ఊదరగొట్టిన ఓ సంస్థ వినియోగదారుకి రూ.30,000 నష్ట పరిహారం చెల్లించింది. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకుంది.

మలయళం టీవీ ఛానెల్స్లో ప్రకటనలతో ఊదరగొడుతున్న ఇందులేఖ సబ్బుతో తన ఫేట్ మారుతుందని భావించిన చాతూ అనే శిల్పి వినియోగదారు ఏడాది పాటు ఆ సబ్బును వాడారు. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆ సబ్బు ప్రకటనలో నటించిన మోహన్ లాల్, ఆ సబ్బును తయారు చేస్తున్న సంస్థ తనను మోసం చేశాయంటూ వాయానంద్లోని వినియోగదారుల కోర్టులో 2015 సెప్టెంబర్ లో కేసు నమోదు చేశారు.
సమాజంలో ఎంతో పలుకుబడి, ప్రభావం ఉన్న మమ్ముట్టీ ప్రకటనను చూసి ఆ సబ్బును వాడానని, అయితే ఎలాంటి ఫలితం లేదని, తనకు నష్టపరిహారం అందజేయాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. దీంతో ఎలాంటి ప్రతివాదనకు అవకాశం ఇవ్వకుండా పరిహారంగా రూ.30,000 రూపాయలు చెల్లిస్తామని ఇందులేఖ సబ్బు తయారీ సంస్థ న్యాయస్థానానికి తెలిపింది. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications