రేడియో జాకీని నరికి చంపేశారు: మిత్రుడికి గాయాలు
తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో మాజీ రేడియా జాకీని గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపేశారు. సోమవారం, మంగళవారం మధ్య రాత్రి అతని స్టూడియో వద్దనే ఆ ఘాతుకానికి పాల్పడ్డారు
మాజీ ఆర్జె రాజేష్ అలియాస్ రసికాన్ రాజేష్ (36) మిమిక్రీ ఆర్టిస్టు, జానపద గాయకుడు కూడా. ఈ సంఘనలో అతని మిత్రుడు గాయపడ్డాడడు. పల్లిక్కల్ పోలీసు స్టేషన్ పరిధిలోని మడవూరులో రాజేష్కు మెట్రో స్టూడియో అనే సౌండ్ రికార్డింగ్ స్టూడియో ఉంది. అక్కడే అతను హత్యకు గురయ్యాడు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను ఇంకా గుర్తించాల్సి ఉంది. ఓ ముఠా ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాజేష్ అతని మిత్రుడు కుట్టన్ ఓ ప్రదర్శన నుంచి తిరిగి వచ్చి, పరికరాలను స్టూడియోలో పెడుతున్న సమయంలో మారుతి స్విఫ్ట్ కారులో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పదునైన ఆయుధాలతో దాడి చేశారు.
కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుట్టన్ తిరువనంతపురం వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దోహాలోని వాయిస్ ఆఫ్ కేరళ ఎఫ్ఎం స్టేషన్లో చేరడానికి ముందు రాజేష్ చాలా సంవత్సరాలు రెడ్ ఎఫ్ఎంలో ఆర్జేగా పనిచేశాడు.
రాజేశ్ ఇటీవలే విదేశాల నుంచి తిరిగి వచ్చి మిమిక్రి బృందంలో చేరినట్లు తెలుస్తోంది. అతనికి భార్య, కుమారుడు ఉన్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications