వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముస్లిం యువకుడి హత్య: శివాలయం పూజలు నిలిపివేత

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: మానవత్వానికి మతంతో సంబంధం లేదని మరోసారి రుజువైంది. ఇటీవల దుండగుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ముస్లిం యువకుడు షబ్బీర్(23)కు నివాళిగా స్థానిక శివాలయం అధికారులు ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. అంతేగాక, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ ఉదంతం వారిని అభినందించేలా చేసింది.

ఓ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న నేపథ్యంలో కొందరు దుండగులు షబ్బీర్‌ను ఇటీవల కర్రలతో కొట్టి చంపిన విషయం తెలిసిందే. ఈ హత్యకు సంబంధించిన వీడియో బయటికి రావడంతో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, మృతుడు షబ్బీర్‌కు సంబంధించి మరో కోణం వెలుగు చూసింది.

Kerala temple stops pujas for two days to mourn Muslim beaten to death

వివరాల్లోకి వెళితే.. షబ్బీర్ అత్తింగల్ సమీపంలోని పుత్తెన్నడ శివాలయానికి సంబంధించిన వార్షిక ఉత్సవాల్లో చురుగ్గా పాల్గొనేవాడట. ప్రతి సంవత్సరం నిర్వహించే ఉత్సవాల నిర్వహణలో నిబద్ధతతో పనిచేసేవాడట. ఈ క్రమంలో షబ్బీర్ అకాల మరణ వార్త విన్న అలయ అధికారులు హతాశులయ్యారు.

అతని మృతికి సంతాపం తెలుపుతూ సదరు ఆలయంలో రెండురోజులపాటు అన్ని పూజలను నిలిపివేయాలని దేవస్థాన పాలక కమిటి నిర్ణయించింది. గుడిలో దీపం వెలగొద్దు, గుడి గంట మోగవద్దని తీర్మానించారు.

దీంతో గడిచిన సోమ, మంగళవారాల్లో దీపారాధాన, తీర్థప్రసాదాలను నిలిపివేశారు. రోజుకు ఐదు రకాల పూజలు నిర్వహించే దేవాలయంలో ముస్లిం యువకునికి గౌరవ సూచకంగా రెండు రోజుల పాటు పూజలు నిలిపివేయడం విశేషంగా నిలిచింది.

English summary
It’s a rare tribute that is drawing as much attention as the tragedy that led to it. A temple in Kerala stopped offering pujas for two days this week to mourn a 23-year-old Muslim man who was beaten to death in an incident that was captured by an eyewitness in a video clip that went viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X