కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం: ఎంపీల్యాడ్స్ నిధులు పునరుద్ధరణ, ప్రతి ఎంపీకి రూ. 5 కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దీనిలో ముఖ్యంగా పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం(ఎంపీల్యాడ్స్) పునరుద్ధరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో నిలిపేసిన ఎంపీ-లాడ్స్ నిధులను పునరుద్ధరిస్తూ కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది.
ఈ ఏడాది నుంచి రూ. 2 కోట్లు నియోజకవర్గ అభివృద్ధి నిధులను మంజూరు చేసేందుకు కేంద్ర మంత్రి మండలి నిర్ణయించిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ వెల్లడించారు. న్యూఢిల్లీలో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సమావేశం అనంతరం ఠాకూర్ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది నుంచి పూర్తిగా రూ. 5 కోట్లు ప్రతి ఎంపీకి అందుతాయని తెలిపారు. ఎంపీలు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం వీటిని కేటాయించుకోవచ్చన్నారు.
2021-22 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి ఒక్కో ఎంపీకి రూ. 2 కోట్ల చొప్పున అందనున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం నుండి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు రెండు విడతలుగా ఒక్కో ఎంపీకి ఏడాదికి రూ. 5 కోట్ల చొప్పున నిధులు విడుదల చేయనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. మరోవైపు, భగవాన్ బిర్సా ముండా జయంతి అయిన నవంబర్ 15వ తేదీని 'జంజాతీయ గౌరవ్ దివస్'గా ప్రకటించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Cabinet approves mechanism for procurement of ethanol by Public Sector Oil Marketing Companies under Ethanol Blended Petrol program. Price of ethanol from C heavy molasses increased to Rs 46.66/litre; from B heavy molasses increased to Rs 59.08/litre: Union Minister Anurag Thakur pic.twitter.com/8ODAzrx5dJ
— ANI (@ANI) November 10, 2021
గిరిజన ప్రజల అద్భుతమైన చరిత్ర, సంస్కృతి, విజయాలను జరుపుకోవడానికి, స్మరించుకోవడానికి 15-22 నవంబర్ 2021 నుంచి వారం రోజుల పాటు వేడుకలు నిర్వహించాలని కేంద్ర మంత్రి మండలి నిర్ణయించిందని అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. కాగా, పెట్రోలు డోపింగ్ కోసం చెరకు నుంచి తీసిన ఇథనాల్ ధరలను 1.28 శాతం పెంచి రూ.63.45కి సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
రైతులకు ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాన్ని వేగవంతం చేయడం, చమురు దిగుమతి బిల్లును తగ్గించడంలో సహాయపడే ప్రభుత్వ లక్ష్యంతో పెంపుదల మద్దతు పొందింది. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్ కింద ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇథనాల్ కొనుగోలు చేసే యంత్రాంగానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. సి హెవీ మొలాసిస్తో తయారైన ఇథనాల్ ధర లీటరుకు రూ.46.66కు, బి హెవీ మొలాసిస్తో తయారైన ఇథనాల్ ధర రూ.59.08కి పెరిగింది.