ఖుష్బు సుందర్కు కీలక పదవి: ప్రధాని మోడీకి థ్యాంక్సంటూ ట్వీట్
జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ)లో సభ్యురాలిగా ఖుష్బును బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది.
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఖుష్బు సుందర్కు ఆ పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలను అప్పగించింది. జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ)లో సభ్యురాలిగా ఖుష్బును బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. ఈ పదవిలో ఖుష్బు మూడేళ్లపాటు కొనసాగనున్నారు.
ఖుష్బుతోపాటు మరో ఇద్దరు మహిళా నేతలు మమతా కుమారి, డెలినా ఖోంగ్డుప్ కూడా జాతీయ మహిళా కమిషన్లో సభ్యురాలిగా నియమించారు. తనను జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి ఖుష్బు సుందర్ ధన్యవాదాలు తెలిపారు. తనకు కీలక బాధ్యతలను అప్పగించారని అన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తానని అన్నారు.

దేశంలోని మహిళల రక్షణ కోసం తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తానని ఖుష్బు సుందర్ స్పష్టం చేశారు. మహిళల హక్కుల రక్షణ కోసం పనిచేస్తానని అన్నారు. మహిళల కోసం పోరాడుతున్న ఖుష్బు సుందర్కు జాతీయ మహిళా కమిషన్లో సభ్యురాలిగా నియమించడాన్ని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై స్వాగతించారు. ఆమెకు అభినందనలు తెలిపారు.
I thank our H'ble PM @narendramodi ji and the government of India for entrusting me with such a huge responsibility. I shall strive hard to protect, preserve & nourish Nari Shakthi which is growing leaps & bounds under your leadership. Looking forward eagerly. #JaiHind@NCWIndia pic.twitter.com/Tm5GTJPEDe
— KhushbuSundar (@khushsundar) February 27, 2023
తమిళనాడు బీజేపీ తరపున ఖుష్బుకు ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. కాగా, అక్టోబర్ 2020లో ఖుష్బు సుందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2021లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రస్తుతం బీజేపీలో జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications