Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శాంతియుతంగా ఉండలేనోళ్లకు ఎన్నికలెందుకు ? రద్దు చేసేస్తాం-హైకోర్టు వార్నింగ్..!

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. ఓవైపు రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరికొన్ని పార్టీలు ఎన్నికల్లో గెలుపుకోసం ఎంతకైనా తెగించేస్తున్నాయి. ఇదే క్రమంలో పశ్చిమబెంగాల్లో ఎలాగైనా ఆధిక్యం కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ, టీఎంసీ తాజాగా శ్రీరామనవమి సందర్భంగా చోటు చేసుకున్న మతఘర్షణలను రాజకీయంగా వాడుకునేందుకు చూస్తున్నాయి. ఈ క్రమంలో కోల్ కతా హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

బెంగాల్లోని ముర్షీదాబాద్ లో శ్రీరామనవమి సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణల్లో 19 మంది వరకూ గాయపడ్డారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కోల్ కతా హైకోర్టు ఇవాళ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ముర్షీదాబాద్ జిల్లాలో ఘర్షణలు చోటు చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శాంతిని కాపాడలేని ప్రజలకు ఎన్నికలు కోరుకునే హక్కు లేదని కోల్ కతా హైకోర్టు అభిప్రాయపడింది.

kolkata hc serious warning to murshidabad voters to countermand elections if not maintain peace

శాంతియుతంగా ఉండలేని వారికి ప్రజాప్రతినిధి ఎందుకని కోల్ కతా హైకోర్టు ప్రశ్నించింది. అంతే కాదు ఇదే పరిస్దితి కొనసాగితే ముర్షీదాబాద్ లో ఎన్నికలు రద్దు చేస్తామని హెచ్చరించింది. కోల్ కతాలో 33 చోట్ల శ్రీరామనవమి వేడుకలు జరిగినా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని, ముర్షీదాబాద్ లోనూ గతంలో ఎప్పుుడూ ఇలా జరగలేదని హైకోర్టు తెలిపింది. ఈసారి బయట వ్యక్తుల ప్రమేయంతోనే ఈ ఘర్షణలు చోటు చేసుకున్నట్లు భావిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఘర్షణలు రెచ్చగొట్టిన వ్యక్తుల వివరాలు ఎల్లుండి లోగా ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+