అయోద్యలోనే పుట్టిన కొరియన్ మహారాణి
లక్నో :కొరియన్ మహారాణి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అయోద్యలో జన్మించారని కొరియన్లు నమ్ముతారు. అందుకే పెద్ద సంఖ్యలో కొరియన్లు అయోద్యను సందర్శిస్తుంటారు.మహరాణికి గుర్తుగా ఆలయాన్ని నిర్మించాలని కొరియన్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరుతున్నారు.
ప్రతి ఏటా దక్షిణ కొరియ నుండి వందలాది మంది అయోద్యకు వస్తుంటారు.అయోద్యలోనే కొరియన్ మహారాణి జన్మస్థలమని వారు నమ్ముతారు. అందుకే ప్రతి ఏటా కొరియన్లు అయోద్కు వస్తుంటారు.కరక్ వంశాన్ని స్థాపించిన కొరియన్ల మహరాజు కిమ్ సురో. ఆయన సతీమణి హార్ వాంగ్ ఒక్. ఈమెను సురిరత్న అని కూడ పిలుస్తారు. వాంగ్ పుట్టినిల్లు అయోద్య అని కొరియన్లు విశ్వసిస్తారు.
క్రీ.శ 48 లో పడవ ద్వారా దక్షిణ కొరియాకు వెళ్ళి గమ్ వాన్ గయ అనే రాజ్యాన్ని స్థాపించిందని వారు నమ్ముతున్నారు.కిమ్ సురోను పెళ్ళాడిన తర్వాత పది మంది పిల్లలకు ఆమె జన్మనిచ్చింది.వీరి నుండే కరక్ వంశం ఆవిర్భవించిందని కొరియన్లు నమ్ముతారు.ఈ నమ్మకం ఆదారంగా కొరియన్లు అయోద్యకు వస్తుంటారు.

వాంగ్ ఒక్ 157 ఏళ్ళు బతికిందని కొరియన్లు చెబుతుంటారు. కొరియన్ మహారాజుకు భార్య దొరకడం లేదని, దేవుడు కలలో కన్పించి చెప్పడంతో ..అతని కలుసుకోవాలని దేవుడు ఆదేశించడంతో ఒక్ కొరియాకు వెళ్ళిందని వారు చెబుతుంటారు.తమ తెగకు చెందిన తొలి మహారాణి అయోద్యలో పుట్టిందని, అక్కడి నుండే రాయిని తీసుకెళ్ళి ఆమె సమాదిని కట్టారు.
ఒక్ సమాధిపై ఈ అంశాన్ని రాశారు .దక్షిణ కొరియా పర్యటనకు వెళ్ళిన ప్రదానమంత్రి నరేంద్రమోడీని కొరియన్లు అయోద్యలో వాంగ్ ఒక్ కు ఒక ఆలయాన్ని నిర్మించాలని కోరింది అక్కడి ప్రభుత్వం.ఉత్తర్ ప్రదేశ్ సిఎం ను కూడ కొరియన్లు ఈ మేరకు ఆళయం గురించి అభ్యర్థించారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications