ఏంటీ ఇదీ క్షమాబింధు.. ఇలా చేస్తావా..? ఏం చేసిందంటే.. మహారాణినంటూ..?
భారతదేశం... సనాతన సాంప్రదాయాలకు వేదిక.. భిన్న సంస్కృతుల సమ్మేళనం.. ఆచారాలు, వ్యవహారాలలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. మంచి పేరు గడిస్తోంది. కానీ కొత్తదనం పేరుతో కొందరు చేసే చర్యలు అభాసు పాలుకావడానికి దారితీస్తోంది. గుజరాత్కు చెందిన క్షమాబిందు ఇలాంటి పనే చేశారు. అవును తనకు తాను పెళ్లి చేసుకొని ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. వద్దు ఇలా చేయొద్దు అని చెప్పినా.. వినిపించుకోలేదు.

ఎన్ని అడ్డంకులు వచ్చినా..?
క్షమబిందు వివాహాంపై బీజేపీ నేత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆలయంలో చేసేందుకు కూడా అనుమతి లేదు. అయినప్పటికీ ఆమె వెనుకడుగు వేయలేదు. తన సన్నిహితులు, హితుల మధ్య ఇంట్లోనే పెళ్లి తంతు చేసుకుంది. ఒక్కతే.. ఉండి కల్యాణం చేసుకుంది. వినడానికి వింతగా ఉన్న ఇదీ మాత్రం నిజం.. అంతేకాదు తనను విష్ చేసినవారికి థాంక్స్ చెప్పింది. మేసెజ్ చేసిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసింది. ఈ మేరకు ఫేస్బుక్లో పోస్ట్ చేసింది.

మూస పద్దతులు వీడాలని..
పెళ్లి గురించి క్షమ బిందు చెబుతూ.. మూస పద్దతులను వీడనాడాలని అనుకున్నానని వివరించారు. నిజమైన ప్రేమను కనుగొనడంలో అలసిపోయానని చెప్పారు. తాను చేసిన ఈ పని వల్ల ఇతరులకు స్ఫూర్తిగా నిలువాలని అనుకున్నానని పేర్కొన్నారు. ఇలా ఒక్కరే కల్యాణ తంతు చేసి.. దేశంలో తొలి వ్యక్తిగా క్షమా బిందు నిలిచారు.

మహారాణినంటూ..
తానే మహారాణినని క్షమాబిందు చెప్పుకొచ్చారు. తనకు రాజు అక్కర్లేదు అని చెప్పారు. తనకు పెళ్లి రోజు కావాలి.. కానీ మరుసటి రోజు అవసరం లేదన్నారు. అందుకోసమే జూన్ తాను ఈ నెల 11వ తేదీన పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని చెప్పారు. కానీ ఘర్షణకు దారితీస్తోందనే అనుమానంతో ముందే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కూతురిలా తయారై.. ఆచార సాంప్రదాయాల మధ్య వివాహా వేడుక జరగనుంట.. అంతేకాదు పెళ్లి తర్వాత తాను వరుడి ఇంటికి వెళ్లాలని అనుకోవడం లేదని.. తన ఇంటికే రావాలని అనుకున్నానని చెప్పారు.

పురోహితుడు బుక్
పెళ్లి కోసం ఇప్పటికే పురోహితుడిని బుక్ చేశానన వివరించారు. అయితే దేశంలో స్వ వివాహాలపై క్లారిటీ లేదు. అందుకోసమే ట్రెండ్ సెట్ చేద్దామని ఇలా చేశానని వివరించారు. కానీ కొందరికీ తన ఆలోచనలు అంటే నచ్చవని చెప్పారు. అంతేకాదు తాను చేసింది.. ముమ్మాటికీ కరెక్టే అని పేర్కొన్నారు. అయితే ఇప్పటికే జరిగిన, జరుగుతున్న వివాహాలు ఎందుకు విడాకులకు దారితీస్తున్నాయని అడిగారు. తాను కూడా గతంలో ఓ పురుషుడు, ఓ స్త్రీని ప్రేమించానని తెలిపారు. కానీ ఇప్పుడు మాత్రం తనకే తానే అన్నీ అని చెబుతున్నారు. కానీ ఆమె వివాహాం చట్టబద్దం కాదని న్యాయ నిపుణులు అంటున్నారు.

అవకాశం లేదు
భారతదేశ చట్ట ప్రకారం.. సొంతంగా పెళ్లి చేసుకునేందుకు అవకాశం లేదు. ఇద్దరు కలిసే వివాహాం చేసుకోవాలని సనాతన ఆచారాలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని న్యాయ నిపుణులు కూడా అంగీకరిస్తున్నారు. క్షమాబిందు వివాహం చెల్లదని అంటున్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications