లడాఖ్ సరిహద్దుల నుంచి పూర్తిగా వెళ్లని చైనా బలగాలు, యథాతథ స్థితి పునరుద్ధరణపై నీలిమేఘాలు..?
లడఖ్లోని ఎల్ఏసీ వద్ద నుంచి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు పూర్తిస్థాయిలో వెనక్కి వెళ్లలేదు. దీంతో అక్కడ యథాతథస్థితి అమల్లోకి తీసుకొచ్చే పరిస్థితి లేదు. పైకి బలగాలను వెనక్కి తీసుకుంటామని చెబుతోన్న.. ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. ప్రతిష్టంభన కొనసాగడంతో భారత పెట్రోలింగ్ దళాలు ఎల్ఏసీ వద్దకు వెళ్లలేకపోతున్నాయి. అయితే తొలగింపు ప్రక్రియ ముగిసేవరకు సిచుయేషన్ తాత్కాలికంగా ఇలానే ఉంటుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

ఇరుదేశాల మధ్య ఘర్షణ వాతావరణం ఉన్నందున కొన్ని మీటర్ల దూరంలోనే ఇరుదేశాలకు చెందిన బలగాలు ఉన్నాయి. బలగాలు వెనక్కి పంపించడంపై ఉన్నతస్థాయి రాజకీయ చర్చలు జరిగాయని, బలగాల ఉపసంహరణ, యథాతథ స్థితి గురించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అని మేజర్ జనరల్ అశోక్ మెహతా పేర్కొన్నారు. అక్కడ చైనాకు చెందిన వారు ఎక్కువ ఉంటారని.. గాల్వాన్ వ్యాలీ వద్ద పడవర వైపునకు గల ఎల్ఏసీ వద్దకు వెళ్లారని వివరించారు.
Recommended Video
ఎల్ఏసీ భారత భూభాగంలో కిలోమీటర్ దూరంలో ఉందనే వాదనను జాతీయ భద్రతా సలహా బోర్డు సభ్యుడు, మాజీ ఆర్మీ అధికారి లెప్ట్ నెంట్ జనరల్ ఎస్ఎల్ నర్సింహాన్ పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో జూన్ 15వ తేదీ నుంచి పెట్రోలింగ్ తాత్కాలికంగా నిలిపివేసినట్టు వివరించారు. జూన్ 15వ తేదీన జరిగిన ఘర్షణలో కల్నల్ సహా 20 మంది భారతీయ సైనికులు చనిపోయారు. చైనా వైపు కూడా ప్రాణ నష్టం జరిగినా.. చనిపోయిన వారి వివరాలను ఆ దేశం వెల్లడించలేదు. 1962లో ఎల్ఏసీ వద్ద నుంచి 20 కిలోమీటర్ల వెనక్కి వెళ్లేందుకు అంగీకరించమని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని.. అడుగు భూమి కూడా ఇవ్వబోం అని చెప్పారు.












Click it and Unblock the Notifications