Businessmen: భార్యకు దూరంగా ఉంటున్న కొడుకు, కోడలి మీద అత్యాచారం చేసిన మామ, రాత్రిపూట!
రాజ్ కోట్/ జామ్ నగర్/ గుజరాత్: ప్రముఖ వ్యాపారవేత్త అతని కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు. వ్యాపారికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమార్తె పెళ్లి చేసుని అత్తారింటికి వెళ్లిపోయింది. ఇద్దరు కొడుకులు వివాహం చేసుకుని వ్యాపారవేత్తతో కలిసి ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు. పెద్ద కుమారుడికి 20 సంవత్సరాల క్రితం పెళ్లి కావడంతో 18 ఏళ్ల కొడుకు ఉన్నాడు. కుమారుడికి, కోడలి మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. పెద్దలు రాజీ చేసినా ఫలితం లేకుండా పోవడంతో వారు విడాకులు తీసుకున్నారు.
కోడలి తల్లి చనిపోవడంతో భర్త తల్లిదండ్రులు ఆమెను ఓదార్చడానికి వెళ్లారు. భర్త తల్లిదండ్రులు నచ్చచెప్పడంతో విడాకులు తీసుకున్న దంపతులు తరువాత రాజీ అయ్యారు. మళ్లీ అత్తారింటికి వెళ్లిన ఆమెకు కొంతకాలం తరువాత భర్త నరకం చూపించాడు. కొంతకాలానికి భర్త అతని భార్యను వదిలేసి వెళ్లిపోయాడు. భర్త దూరం కావడంతో కొడుకుతో పాటు ఆమె జీవిస్తోంది. తరువాత భర్త తల్లిదండ్రులు కొన్ని రోజులు కోడలి ఇంటిలో ఉన్నారు. ఆ సందర్బంలో తన భర్త తండ్రి, ప్రముఖ వ్యాపారి తనను చంపేస్తానని బెదిరించి తన మీద వరుసగా అత్యాచారం చేశాడని కోడలు కేసు పెట్టడం కలకలం రేపింది.
ప్రముఖ వ్యాపారవేత్త
గుజరాత్ లోని రాజ్ కోట్ లోని జామ్ నగర్ లో ప్రముఖ వ్యాపారి రాజేష్ (పేరు మార్చడం జరిగింది) అనే ఆయన నివాసం ఉంటున్నాడు. ప్రముఖ వ్యాపారవేత్త రాజేష్ అతని కుటుంబ సభ్యులతో కలిసి జామ్ నగర్ లో చాలా సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాడు. వ్యాపారి రాజేష్ కు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమార్తె పెళ్లి చేసుని అత్తారింటికి వెళ్లిపోయింది.
ఇంటికి పెద్ద కోడలు
ఇద్దరు కొడుకులు వివాహం చేసుకుని వ్యాపారవేత్త రాజేష్ తో కలిసి ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు. పెద్ద కుమారుడికి 2002లో పెళ్లి కావడంతో 18 ఏళ్ల కొడుకు ఉన్నాడు. రాజేష్ కుమారుడికి, కోడలి మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. పెద్దలు రాజీ చేసినా ఫలితం లేకుండా పోవడంతో రాజేష్ కొడుకు, కోడలు 2014లో విడాకులు తీసుకున్నారు.
తల్లి చనిపోవడంతో వెళ్లి ఓదార్చారు
విడాకులు తీసుకున్న తరువాత రాజేప్ కొడుకు సూరత్ లో ఉంటున్న అతని భార్య, కుమారుడి జీవనం సాగించడానికి ప్రతినెల భరణం చెల్లిస్తూ వస్తున్నాడు. 2017లో కోడలి తల్లి చనిపోవడంతో భర్త తల్లిదండ్రులు, వ్యాపారి రాజేష్ దంపతులు సూరత్ వెళ్లి ఆమెను ఓదార్చారు. రాజేష్ దంపతులు నచ్చచెప్పడంతో విడాకులు తీసుకున్న దంపతులు తరువాత రాజీ అయ్యారు.
కోడలి ఇంటికి వెళ్లిన వ్యాపారవేత్త
మళ్లీ జామ్ నగర్ లోని అత్తారింటికి వెళ్లిన ఆమెకు కొంతకాలం తరువాత భర్త నరకం చూపించాడు. కొంతకాలానికి రాజేష్ కొడుకు అతని భార్యను వదిలేసి వెళ్లిపోయాడు. రాజేష్ కోడలు ఆమె కొడుకుతో పాటు అక్కడే ఉండిపోయింది. 2022 ఫిబ్రవరి 14వ తేదీన రాజేష్ అతని భార్యతో కలిసి పెద్ద కోడలు ఇంటికి వెళ్లాడు.
కోడలి మీద అత్యాచారం చేసిన మామ!
ఆ సమయంలో కొన్ని రోజులు మా ఇంట్లో ఉన్న మామ రాజేష్ తన కొడుకు ఇంట్లో లేని సమయంలో తనను చంపేస్తానని బెదిరించి నాలుగుసార్లు అత్యాచారం చేశాడని రెండు రోజులు క్రితం అతని కోడలు కేసు పెట్టడం కలకలం రేపింది. అత్యాచారం జరిగిన రెండు నెలల తరువాత కోడలు ఆమె మామ మీద రేప్ కేసు పెట్టడం కలకలం రేపింది. ప్రముఖ వ్యాపారవేత్త మీద అత్యాచారం కేసు నమోదు కావడంతో గుజరాత్ లో హాట్ టాపిక్ అయ్యింది.