Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లఖింపూరిఖేరి హింస: కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపుర్‌ ఖేరి హింసాత్మక ఘటనలో నిందితుడిగా భావిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రాకు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు. శనివారం దాదాపు 12 గంటల విచారణ అనంతరం రాత్రి ఆశిష్ మిశ్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

ఆదివారం కోర్టులకు సెలవు కావడంతో రాత్రే జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు. అంతకుముందు ఆయనకు క్రైం బ్రాంచ్‌ కార్యాలయంలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆశిష్‌ మిశ్రాను పోలీసుల రిమాండుకు అనుమతించాలని కోరుతూ న్యాయమూర్తికి దరఖాస్తు సమర్పించామని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్‌పీ యాదవ్‌ తెలిపారు. దీనిపై సోమవారం విచారణ జరగనుంది.

అక్టోబర్ 3న ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మృతి చెందారు. ఈ ఘటనలో నిందితుడిగా ఆశిష్‌ మిశ్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా, అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలో మరో నలుగురు మృతి చెందారు. రైతుల మృతిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఈ కేసులో ఆశిష్‌ మిశ్రా పేరును పోలీసులు చేర్చారు. శనివారం క్రైం బ్రాంచ్‌ పోలీసుల ఎదుట ఆశిష్‌ హాజరయ్యారు.

 Lakhimpur violence: Union ministers son Ashish Mishra sent to 14-day judicial custody

మరోవైపు, లఖింపుర్‌ ఖేరి ఘటనకు సంబంధించిన వాస్తవాలను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ రామ్ నాథ్ కోవింద్‌కు వివరించేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమైంది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలోని ఏడుగురు సభ్యుల బృందం రాష్ట్రపతిని కలవనున్నట్లు తెలిపింది. ఇందుకోసం అనుమతి కోరుతూ రాష్ట్రపతి భవన్‌‌కు తాజాగా లేఖ రాసింది. ఈ బృందంలో రాహుల్‌ గాంధీతో పాటు ప్రియాంకా గాంధీ వాద్రా, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఏకే ఆంటోని, మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌, గులాం నబీ ఆజాద్‌, అధీర్‌ రంజన్‌ ఛౌదురి రాష్ట్రపతిని కలువనున్నారు.

లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో నలుగురు రైతులతో సహా మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు కారణమంటూ రైతులు, ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. ఆశిష్‌ మిశ్రతోపాటు ఆయన అనుచరులు స్వయంగా వాహనం నడుపుకుంటూ తమపైకి దూసుకొచ్చినట్లు రైతులు చెబుతున్నారు. అయినప్పటికీ నిందితులతోపాటు కేంద్ర మంత్రిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు' అని రాష్ట్రపతి భవన్‌కు రాసిన లేఖలో కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది.

Recommended Video

    Chinese Troops ని నిర్బంధించిన Indian Army | Tawang Standoff బంకర్ల ధ్వంసం || Oneindia Telugu

    ఈ నేపథ్యంలో లఖింపుర్‌ హింసకు సంబంధించిన వాస్తవాలతో కూడిన పూర్తి సమాచారాన్ని రాష్ట్రపతి ముందుంచేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతి భవన్‌ను కోరింది. మరోవైపు, లఖింపూర్ ఖేరి ఘటనను ఇరువర్గాల మధ్య ఘర్షణ చిత్రీకరించడంపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటివి అనైతికమని, చాలా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. గాయాన్ని పెద్దది చేసే ప్రయత్నాలు మానుకోవాలని వరుణ్ గాంధీ హితవు పలికారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+