జైలు శిక్ష: తట్టుకోలేక లాలూ ప్రసాద్ యాదవ్ సోదరి మృతి
పాట్నా: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జెడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ సోదరి గంగోత్రి దేవీ ఆదివారంనాడు మరణించారు. దాణా కుంభకోణం కేసులో అంతకు ముందు రోజే లాలూకు మూడున్నరేళ్ల జైలు శిక్ష పడింది.
లాలూ ప్రసాద్కు జైలు శిక్ష పడడాన్ని తట్టుకోలేక దిగ్బ్రాంతికి గురై ఆమె మరణించినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే లాలూ సతీమణి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి గంగోత్రి నివాసానికి చేరుకున్నారు.

లాలూకు శిక్ష పడకూడదని 73 ఏళ్ల గంగోత్రి గత కొద్ది రోజులుగా క్రమం తప్పకుండా ప్రార్థనలు చేస్తోందని, ఆదివారం రోజంతా ప్రార్థనలు చేస్తూనే గడిపిందని, లాలూ త్వరగా విడుదల కావాలని ఆదివారంనాడు ఆమె పూజలు చేసిందని అన్నారు.
దిగ్భ్రాంతికి గురై తట్టుకోలేక గంగోత్రి మరణించిందని రబ్రీ దేవి విలపిస్తూ మీడియా ప్రతినిధులతో అన్నది. విషయం తెలిసిన వెంటనే లాలూ కుమారులు తేజస్వి, తేజ్ ప్రతాప్ ఆమెకు పుష్పగుచ్ఛాలతో నివాళులు అర్పించారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications