దారుణం: క్లాస్లోనే లెక్చరర్ను కాల్చి చంపిన విద్యార్థి
సోనిపత్: హర్యానా రాష్ట్రంలోని సోనెపత్ జిల్లా షాహేబ్ దల్బీర్సింగ్ కశాశాలలో మంగళవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. చదువు చెప్పే అధ్యాపకుడినే ఓ విద్యార్థి అత్యంత దారుణంగా తరగతి గదిలోనే తుపాకీతో కాల్చి చంపేశాడు. అనంతరం అక్కడ్నుంచి పరారయ్యాడు.
ఈ ఘటనలో రాజేశ్ మాలిక్ అనే అధ్యాపకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. నిందిత విద్యార్థి నాలుగు రౌండ్లు కాల్పులు జరపడంతో రాజేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులకు పాల్పడిన విద్యార్థిని గుర్తించామని, అతని కోసం గాలింపు ప్రారంభించామని పోలీసులు చెప్పారు. అధ్యాపకుడిని ఎందుకు హత్య చేశాడనే దానికి సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు.
కాగా, రాజేష్ మాలిక్ మృతి చెందాడన్న వార్త విని ఆయన తండ్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. రాజేష్ మృతితో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications