అజిత్ పవార్ ఎన్సీపీ ప్లోర్ లీడర్, రాజ్యాంగబద్ధంగా, న్యాయంగా వ్యవహరించారు: మనిందర్ సింగ్
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సుప్రీంకోర్టులో వాదనలు ఆసక్తికరంగా జరుగుతున్నాయి. అజిత్ పవార్ తరఫున మనిందర్ సింగ్ తన వాదనలు వినిపిస్తున్నారు. ఇది తమ పార్టీ అంతర్గత అంశమని కోర్టులో తెలిపారు. తాను కూడా ఎన్సీపీకి చెందిన వారినని చెప్పడం పరిస్థితి ఆసక్తికరంగా మారింది.
ఎన్సీపీ పక్ష నేత అజిత్ పవార్ వ్యవహరించాడని సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి అజిత్ తీసుకొచ్చారు. రాజ్యాంగపరంగా, న్యాయంగా తాము బీజేపీకి మద్దతిస్తున్నట్టు అజిత్ స్పష్టంచేసినట్టు మనిందర్ తెలిపారు. తమ మద్దతు గురించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం కూడా సరికాదన్నారు. దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు కదా అని ప్రశ్నించారు. ఒకవేళ కంప్లైంట్ వచ్చి ఉంటే.. తొలుత హైకోర్టును ఆశ్రయించాల్సి ఉండేదని అభిప్రాయపడ్డారు. అంతేకానీ సుప్రీంకోర్టులో కాదని పేర్కొన్నారు.

వాస్తవానికి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంతో అజిత్ పవార్ ఎన్సీపీ పక్ష నేతగా ఎన్నికయ్యారు. రాజ్యాంగం ప్రకారం అతను విచక్షణ మేరకు నడుచుకున్నారని అతని తరఫు లాయర్ మనిందర్ సింగ్ సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.


Click it and Unblock the Notifications